పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి

బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని విద్యార్థులు మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు మృతి చెందారు.

New Update
Students Clash in Bihar

Students Clash in Bihar

బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో దారుణం జరిగింది. పదో తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని వచ్చిన ఆరోపణలు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. పలువురు విద్యార్థులు ఏకంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. మరోకరు చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే  ఈ స్టోరీ చదవాల్సిందే.  

Also Read: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే.. ఏమన్నారంటే ?

ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లో ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే రోహ్‌తాస్‌లోని సాసారామ్‌ పట్టణంలో ఫిబ్రవరి 19న జరిగిన పరీక్షల్లో చీటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. మరుసటి రోజు విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. మరికొందరు తుపాకులతో కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనే ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఒకరు మృతి చెందారు.     

Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?

దీంతో బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సాసారామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. విద్యార్థులు చికిత్స తీసుకుంటున్న స్థానిక ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్‌లోనే 9మంది మృతి!

Also Read: ట్రంప్‌ ఎఫెక్ట్‌ ...నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు