/rtv/media/media_files/2025/02/28/USq8xWy0p3cyH17qrKG6.jpg)
Single Lemon Sold for 13000 rupees in Tamil Nadu
సాధారణంగా ఒక నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది. రూ.3 లేదా రూ.5 ఉంటుంది. కానీ ఒక నిమ్మకాయం ఏకంగా రూ.13 వేలకు అమ్ముడుపోయింది. ఏంటీ షాకైపోయారా ?. మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఈరోడ్ జిల్లా విలకేతి గ్రామంలో పళమ్తిన్ని కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో పూజా కార్యక్రమం కోసం వినియోగించే ఒక నిమ్మకాయను వేలం పాట వేశారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
మహాశివరాత్రి పండుగలో భాగంగా బుధవారం అర్ధరాత్రి నిమ్మకాయ కోసం వేలం నిర్వహించారు. పవిత్రంగా భావించే ఆ నిమ్మకాయను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. చివరికి అది వేలంలో రూ.13 వేల రికార్డు ధర పలికింది. ఆలయంలో పూజా కార్యక్రమం కోసం ఉపయోగించే నిమ్మకాయ కోసం ప్రతి ఏడాది వేలం వేసే ఆచారం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్
అంతేకాదు నిమ్మకాయతో పాటు ప్రధాన దేవత విగ్రహంపై ఉంచిన వస్తువులను వేలం వేశారు. ఇందులో వెండి ఉంగరం కూడా ఉంది. అయితే తంగరాజ్ అనే భక్తుడు వేలంపాటలో రూ.13వేలకు నిమ్మకాయను దక్కించుకున్నారు. ఇక అరచలురు ప్రాంతానికి చెందిన చిదంబరం అనే వ్యక్తి రూ.43,100కి ఉంగరాన్ని పొందాడు. రవికుమార్, భానుప్రియ ఇద్దరూ రూ.35 వేలకు వెండి నాణేన్ని పొందారు. అయితే ఇలా ఆలయంలోని వస్తువులను తీసుకెళ్తే తమకు అంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు.
Also Read: ఉత్తరాఖండ్లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు