/rtv/media/media_files/2025/06/11/cHxE5Vmz5AxULT6laEsA.jpg)
Caretaker robbery
Caretaker : ఓ ఎనభై రెండేళ్ల విశ్రాంత ప్రొఫెసర్ తన సంరక్షణ చూసుకునేందుకు నియమించుకున్న కేర్ టేకర్ చేతిలో మోస పోయాడు. తనను నమ్మి అన్ని అప్పగించినందుకు ఆయన ఆస్తులన్నింటిని తన పేరుమీద రాయించుకుని ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించి కేర్ టేకర్ పారిపోయింది. ముంబయిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయికి చెందిన మన్మోహన్ అనే రిటైర్డ్ ఐఐటీ ప్రొఫెసర్ పోవైలోని హిరాందానీ గార్డెన్ లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. ఆయన వద్ద నికిత అనే మహిళ కొంతకాలంగా కేర్టేకర్గా పనిచేస్తోంది. అయితే ఆయనకున్న అనారోగ్య సమస్యలను ఆసరా చేసుకున్న నికిత మన్మోహన్ పేరు మీద ఉన్న మూడు ప్లాట్లతో పాటు ఆస్తులన్నింటిని తన పేరు మీద రాయించుకుంది. అంతటితో ఆగకుండా ఆయనను తీసుకెళ్లి ఓ వృద్ధాశ్రమంలో చేర్చింది.
Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?
తన తండ్రిని చూడడానికి పుణెలో ఉండే ఆయన కుమారుడు గత నెలలో మన్మోహన్ నివాసానికి వచ్చాడు. అయితే అక్కడ ఆయన తండ్రి అక్కడ లేడు. స్థానికులు చెప్పిన సమాచారం మేరకు స్థానికంగా ఉన్న ఆశ్రమంలో ఆయన ఉన్నాడని తెలుసుకుని వెళ్లి ఆయనను కలిశాడు. అసలేం జరిగిందని విచారించాడు. ఆ తర్వాత వారు పోలీసులను ఆశ్రయించడంతో నికిత చేసిన మోసం వెలుగు చూసింది.
పోలీసుల ఎంక్వయిరీలో తేలిన వివరాలను బట్టి 2009 నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్ మన్మోహన్ ఒంటరిగా ఉంటున్నారు. అతనికి కుమారుడు, భార్య ఉన్నప్పటికీ వారు ఉద్యోగ రీత్యా పుణెలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి..వెళ్తున్నారు. ఇదిలా ఉండగా మన్మోహన్ స్థానికంగా ఉన్న ఒక పార్కులో యోగా సాధన చేసేవాడు. అలా అక్కడ 2017లో నిఖితా నాయక్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మన్మోహన్ అవసరాలు తీర్చేది. ఆమెపై నమ్మకం ఏర్పడడంతో నికితను తనకు కేర్టేకర్గా ఉండాలని కోరాడు. దానికి అంగీకరించిన ఆమె అప్పటి నుంచి ఆయనతో పాటే అదే ఫ్లాట్లో ఉంటుంది. ఆ తర్వాత మన్మోహన్ కంటి చూపు మందగించడంతో ఆయన మొబైల్ ఫోన్ను ఆపరేట్ చేయడంలో, బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడం కూడా నికితనే చూస్తోంది.
ఇది కూడా చదవండి: మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్ కషాయం..!!
దీంతో మన్మోహన్కు సంబంధించిన అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, కార్డులు ఆమె వద్దే ఉంచుకుంది. ఇదిలా ఉండగా 2025 ఏప్రిల్లో వివిధ చట్టపరమైన పనులు ఉన్నట్లు నమ్మించిన నికిత ఆయనను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి, అతడితో సంతకాలు చేయించి ఆయన ఆస్తిలో మూడింట ఒక వంతును గిఫ్ట్ డీడ్గా తన పేరు మీదకు బదిలీ చేయించుకుంది. వీటితో పాటు బంగారు నగలు, సంతకం చేసిన చెక్కులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్ని కూడా తీసుకుంది. వీటి మొత్తం రూ.6 కోట్ల వరకు ఉంటుంది. ఇక తన పని ముగియగానే రిటైర్డ్ ప్రొఫెసర్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించి పారిపోయింది. వృద్ధుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేర్టేకర్పై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..? ఓ అధ్యయనంలో చెప్పిన షాకింగ్ నిజాలు..!!