Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!

శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్  బుధవారం ఉదయం కన్నుమూశారు. 'బ్రెయిన్ స్ట్రోక్' కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని SGPGIలో చేర్చారు.

New Update
ayodhya saty

ayodhya saty

Big Breaking: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్  బుధవారం ఉదయం కన్నుమూశారు. 'బ్రెయిన్ స్ట్రోక్' కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని SGPGIలో చేర్చారు. ఆయనకి డయాబెటిస్, అధిక రక్తపోటు కూడా ఉన్నాయి. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి శ్రీ సత్యేంద్ర దాస్ జీ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

సత్యేంద్ర దాస్ ఎప్పుడు పూజారి అయ్యారంటే!


1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు దాస్ తాత్కాలిక రామాలయ పూజారిగా ఉండేవారు. రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిచేసిన, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్న దాస్ వయసు అప్పుడు కేవలం 20 సంవత్సరాలు. ఆయన అయోధ్య అంతటా మ విస్తృతంగా గౌరవం అందుకున్నారు.

Also Read: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

నిర్వాణి అఖాడకు చెందిన దాస్, అయోధ్యలో అత్యంత అందుబాటులో ఉండే సాధువులలో ఒకరు.  అంతేకాకుండా అయోధ్యతో పాటు,  రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై సమాచారం కోరుతూ దేశవ్యాప్తంగా అనేక మంది మీడియా వ్యక్తులకు అందుబాటులో ఉండే ఓ ప్రముఖ వ్యక్తి దాస్ . డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఆయన ప్రధాన పూజారిగా తొమ్మిది నెలలనుంచి మాత్రమే పనిచేస్తున్నారు. 

ఈ కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చిన భారీ రాజకీయ తిరుగుబాటుకు కారణమైంది.  రామమందిర ఉద్యమం, ముందుకు సాగే మార్గంపై మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు దాస్ ఎల్లప్పుడూ ఓపికగా సమాధానాలిచ్చేవారు. కూల్చివేత తర్వాత కూడా, దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.  రామ్ లల్లా విగ్రహాన్ని తాత్కాలిక గుడారం కింద ప్రతిష్టించినప్పుడు  కూడా పూజలు చేశారు.

Also Read: Maha Kumbh: కుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జననం..మారుమోగుతున్న వారి పేర్లు

Also Read:Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు