/rtv/media/media_files/2025/06/11/LxQbqpZDXeB3O0vUHido.jpg)
Tatkal New Rule
Tatkal New Rule: కేంద్ర ప్రభుత్వం తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ప్రయాణికుల గుర్తింపు, టికెట్ మాఫియాల నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. జూలై 1వ నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేయాలంటే ప్రయాణికుడి ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లకు కొత్త సర్క్యులర్ జారీ చేశారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగా ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది పూర్తిగా బాధ్యతాయుతమైన టికెట్ బుకింగ్ వ్యవస్థకు దారి తీస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
కొత్త రూల్లో ఓటీపీ తప్పనిసరి..
జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని కూడా తప్పనిసరి చేస్తున్నారు. అంటే టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కౌంటర్లు, అధికారిక ఏజెంట్ల ద్వారా చేసే బుకింగ్లకూ వర్తించనుంది. అనధికారిక ఏజెంట్ల బుకింగులను అరికట్టేందుకు, తత్కాల్ బుకింగ్ సమయంలో అధికారిక ఏజెంట్లకు టికెట్లను బుక్ చేసుకునేందుకు తొలి 30 నిమిషాల పాటు అనుమతి ఇవ్వబోమని రైల్వే శాఖ పేర్కొంది. ఏసీ ఉదయం 10.30 గంటల తర్వాతే, నాన్-ఏసీ ఉదయం 11.30 గంటల తర్వాతే టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. దీంతో సాధారణ ప్రయాణికులకు ముందుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్ కషాయం..!!
ఈ మార్పులను అమలులోకి తేనికై రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ సాంకేతికంగా తగిన మార్పులు చేయాల్సిందిగా సూచనలు అందాయి. ఈ చర్యల వల్ల టికెట్ దుర్వినియోగాన్ని నియంత్రించడమే కాకుండా.. నిజమైన ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించగలమన్నది రైల్వే శాఖ ఉద్దేశ్యం. ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ట్రైన్ బయల్దేరే 4 గంటల ముందు టికెట్ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ప్రయాణికులు ముందుగానే టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది తెలిసేలా చేయడమే లక్ష్యంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా బికనేర్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 24 గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల స్థితిగతులపై సమాచారం అందించేలా వ్యవస్థను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయాణికుల అనిశ్చితి నివారించేందుకు ఈ మార్పు ఎంతో ఉపయోగపడనుంది.
( tatkal-tickets | train-tatkal-ticket | Latest News | railway | tickets)
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..? ఓ అధ్యయనంలో చెప్పిన షాకింగ్ నిజాలు..!!