ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.

New Update
Rahul gandhi fire on modi

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. ఆయనపై మూడు ప్రశ్నలు సంధించారు. పాకిస్తాన్‌తో మోదీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు రాహుల్ గాంధీ. ఎక్స్ వేధికగా మోదీకి రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు వేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోతోపాటు ఆయన ప్రశ్నలను ట్వీట్ చేశారు.
1. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?
2. భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు?
3. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది?

గుజరాత్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశలో మోదీ గురవారం మాట్లాడారు. దానిపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం మరుగుతుందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని, పాకిస్తాన్‌ కోరలు విరిచేస్తామని చెప్పి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ఆయన ప్రధాని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం లేదని పాకిస్తాన్ చెబుతున్న మాటలను ఎందుకు నమ్ముతున్నారని ఆయన ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు.

bjp | pm modi | pakistan | india | terrorism | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు