New Update
/rtv/media/media_files/2025/04/09/YlZN9lumqekjxhoH6l5Y.jpg)
Rahul Gandhi
గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. '' దేశ జనాభాలో 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదు. 90 శాతం అవకాశాలను ఇతరులు లాగేసుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. కుల గణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుంది.
ట్రంప్ టారిఫ్తో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ట్రంప్ టారిఫ్లు వేస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే ట్రంప్ టారిఫ్లు వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారు. అదానీ, అంబానీలకే దోచి పెడుతున్నారు. RSS, బీజేపీ.. ఈ రెండూ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. గాంధేయవాదులందరూ ఏకం కావాలని'' రాహుల్ గాంధీ అన్నారు.
మరోవైపు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్వతంత్య్ర పోరాటంలో ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లే బీజేపీని ఓడించాలని అన్నారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా.. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కులగణన చేసినట్లే దేశావ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని తేల్చిచెప్పారు.
తాజా కథనాలు