Indian Army: పూంఛ్‌ సెక్టార్‌లో కాల్పులు.. పాక్‌ను తిప్పికొట్టిన భారత్

పూంఛ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అర్థరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్‌ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడటంతో భద్రతా బలగాలు తక్షణమే స్పందించాయి.

New Update
india pak war

ind vs pak

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే వరుసగా నాలుగో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. పూంఛ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అర్థరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్‌ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి శత్రువుల దాడిని తిప్పికొట్టాయని భారత సైన్యం వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

Punch Sector Pakistan Fires

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

పర్యాటకులను టార్గెట్ చేసి..

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. అయితే ఈ ఉగ్రవాదులలో ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

 

telugu-news | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు