Droupadi Murmu: జాతినుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము.. జమిలి ఎన్నికలపై ఏమన్నారంటే ?

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది మర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం కొనసాగుతోందన్నారు. జమిలి ఎన్నికల విధానం సుపరిపాలన అందేంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
President Droupadi Murmu

President Droupadi Murmu

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా భారత్‌ నాయకత్వం వహించే స్థాయికి చేరిందని తెలిపారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసినవాళ్లని స్మరించుకోవాలని తెలిపారు. మారుతున్న కాలానికి తగ్గట్టు చట్టాలను మార్చుకున్నామని.. కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 

Also Read: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?

అయితే రాష్ట్రపతి ముర్కు జమిలి ఎన్నికల అంశాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానం దేశంలో సుపరిపాలన అందేంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ విధానం పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, వనరుల మళ్లింపును, ఆర్థిక భారాన్ని తగ్గించడం ఇలా అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. గత 75 ఏళ్ల నుంచి రాజ్యాంగమే దేశాన్ని పాలిస్తోందని.. వలసవాదుల ఆలోచన విధానాన్ని మార్చేందుకు దేశం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు