BIG BREAKING: కేంద్రమంత్రి అరెస్టు.. !

పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ అల్లర్ల బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

New Update
Police detain Union minister Sukanta Majumdar

Police detain Union minister Sukanta Majumdar

వక్ఫ్‌ బోర్డుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. మరో 280 మందిని అరెస్టు చేశారు. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ అల్లర్ల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: వక్ఫ్‌ బోర్టుకు వ్యతిరేకంగా అల్లర్లకు వారే కారణం: మమతా బెనర్జీ

కోల్‌కతాలోని సీఎం మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సుకాంత ముందార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నాం. బాధితుల కోసం విరాళాలు సేకరించడం నేరమా ? మేము నిరసనలు చేయకూడదా ?, ఇది మా ప్రాథమిక హక్కు'' అని సుకాంత ముందార్‌ అన్నారు. 

Also Read: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ

మరోవైపు దీనిపై ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. '' ఇది చాలా భద్రతపరమైన ప్రాంతం. ఎవరైనా ఇక్కడ ఏదైనా ప్రొగ్రామ్ నిర్వహించాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. బీజేపీ నేతలు విరాళాలు సేకరించే ముందు స్థానిక పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందని'' తెలిపారు. 

Also Read: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్

పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్‌(సవరణ) చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ అల్లర్లపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్‌ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన కొందరు దుండగులు.. యువకులను రెచ్చగెట్టి అల్లర్లకు కారణమయ్యారని అన్నారు. 

telugu-news | national-news | west bengal

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral News: పెళ్లి కూతురుకు రూ.55 వేలు, టీవీ, వంట సెట్.. సర్కార్ సంచలన కొత్త స్కీమ్.. వివరాలివే!

పెళ్లి చేసుకునే పేద ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన పథకం తీసుకొచ్చింది. 'సీఎం కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు అందిస్తోంది. వీటితోపాటు టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం తదితర వస్తువులను ఇస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలు నిర్వహిస్తుంది.

New Update
madya pradesh

Madhya Pradesh govt launches sensational scheme for poor girls marriage

Viral News: పెళ్లి చేసుకునే ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన స్కీమ్ తీసుకొచ్చింది. 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు, 32అంగుళాల కలర్ టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం, అల్మారా వివాహ సహాయంగా అందిస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తుంది. అయితే ఇందుకోసం ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి అర్హులెవరు అనే అంశాలు ఇలా ఉన్నాయి. 

పేద కుటుంబాలకు గౌరవంగా..

2006లో ప్రారంభించిన ఈ పథకం ఆడపిల్లలుగల పేద కుటుంబాలు గౌరవంగా పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఇందులో కేవలం డబ్బు మాత్రమే కాదు ఇతర ఖర్చులను తగ్గించేందుకు పెళ్లి వస్తువులను కొనిపెడుతుంది. కలర్ టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం, అల్మారా తదితర వస్తువులను పెళ్లి వరకట్నంలో అందిస్తుంది. ఇది తమకెంతో భారాన్ని తగ్గిస్తుందని పేద పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వస్తువుల లిస్ట్:

LPG కనెక్షన్ + స్టవ్.
32 అంగుళాల కలర్ టీవీ.
స్టీల్ అల్మారా, మంచం, ప్రెషర్ కుక్కర్.
గోడ గడియారం, డైనింగ్ టేబుల్.
వధువు బట్టలు, ఇతర అవసరమైన వస్తువులు.

ఎవరికి వర్తిస్తుంది?

అమ్మాయి మధ్యప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
అమ్మాయి కనీస వయస్సు 18 సంవత్సరాలు.
అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు.
సామూహిక వివాహంలో మాత్రమే వివాహం తప్పనిసరి. 
సొంత వివాహానికి చెల్లదు.
విడాకులు తీసుకున్న మహిళలు కూడా అర్హులు (సర్టిఫికేట్ అవసరం).
వివాహానికి కనీసం 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

సమీపంలోని నాగర్ నిగమ్/పంచాయతీ కార్యాలయం నుండి ఫారమ్ తీసుకోవాలి.
సరైన సమాచారం, ఇతర స్థానిక ఫ్రూఫ్ పత్రాలతో ఫారమ్ నింపాలి.
స్థానిక అధికారి ధృవీకరణ చేస్తారు. 
షెడ్యూల్ చేసిన తేదీన సామూహిక వివాహంతోపాటు స్కీమ్ ప్రయోజనాల పంపిణీ.

అవసరమైన పత్రాలు:

వధూవరుల ఆధార్ కార్డు.
జనన ధృవీకరణ పత్రం.
కుల ధృవీకరణ పత్రం.
పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
విడాకుల ధృవీకరణ పత్రం.
అమ్మాయి పేరు మీద బ్యాంకు ఖాతా.
రిజిస్టర్డ్ శ్రామిక్ కార్డ్ (ఏదైనా ఉంటే)

 

Advertisment
Advertisment