/rtv/media/media_files/2025/04/22/x6BEPavBcc0uksW5xLhD.jpg)
Mamata Benarjee
పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్(సవరణ) చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ అల్లర్లపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ
వెస్ట్ బెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన కొందరు దుండగులు.. యువకులను రెచ్చగెట్టి అల్లర్లకు కారణమయ్యారని అన్నారు. ఈ హింస వెనుకున్న కుట్రదారులను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తానని చెప్పారు. ఈ అల్లర్లలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున చెరో రూ.10 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న బంగ్లార్ బారి స్కీమ్ కింద వాళ్ల ఇళ్లను కూడా మళ్లీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)
ఇదిలాఉండగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఈ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. అలాగే 280 మందిని అరెస్టు చేశారు. ఈ అల్లర్లలో పలువురి ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారు. మరోవైపు ఈ అల్లర్లలో ఉగ్ర సంస్థల హస్తం ఉందని.. వాల్లే యువకులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలిపాయి.
Also Read: 9మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?
mamata-benarjee | national-news | Waqf Amendment Act