/rtv/media/media_files/2025/05/07/wTI6UenZLOpK6YCoGorC.jpg)
PM Modi
పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం కొన్ని రోజులుగా చెబుతూనే ఉంది. అన్నట్టుగానే నిన్న అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది స్థావరాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. దీనికి పాక్ సౌన్యం కూడా స్పందించింది. భారత దాడులు అనంతరం సరిహద్దులు వెంబడి కాల్పులు చేసింది. దీనికి భారత ఆర్మీ కూడా ధీటుగా జవాబిచ్చింది. దీంతో ఎల్వోసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది.
ADMIN POST.
— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) May 6, 2025
India releases a statement saying it has started 'Operation Sindoor' and is only attacking terrorist infrastructure in Pakistan, not Pakistani military sites. pic.twitter.com/fZzG08HZLb
వార్ రూమ్ నుంచి..
ఈ మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి వాచ్ చేశారు. భారత ఆర్మీకి మద్దుతుగా నిలిచారు. మరోవైపు ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. ఆపరేషన్ సింధూర్ పై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడారు. ఆయనకు అన్నీ వివరించారు.
Prime Minister Narendra Modi is constantly monitoring Operation Sindoor throughout the night. The strike on all nine targets is successful: Sources to ANI pic.twitter.com/7ICP5BJNR6
— ANI (@ANI) May 6, 2025
today-latest-news-in-telugu | attacks | pm modi