PM Modi: మారిషస్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎందుకంటే

ప్రధాని మోదీ మారిషస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న అక్కడ జరగనున్న 57వ నేషనల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌ గూలమ్‌ పార్లమెంటులో ఈ విషయాన్ని తెలిపారు.

New Update
PM Modi to attend Mauritius' National Day as guest of honour

PM Modi to attend Mauritius' National Day as guest of honour

ప్రధాని మోదీ మారిషస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న అక్కడ జరగనున్న 57వ నేషనల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌ గూలమ్‌ పార్లమెంటులో ఈ విషయాన్ని తెలిపారు. ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు. '' మన దేశ 57వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారత ప్రధానమంత్రి మోదీ.. ముఖ్య అతిథిగా హాజరుకావడానికి ఒప్పుకున్నారు. 

Also Read: రూ.10 వేల కోట్లు ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం: సీఎం స్టాలిన్

ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. ఆయనకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాకూడా మన ఆహ్వానానికి ఒప్పుకోవడం మనకు దక్కిన గౌరవం. ఇలాంటి వ్యక్తికి మన ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒత ప్రత్యేక గౌరవమేనని'' నవీన్‌ రామ్‌ గూలమ్‌ పార్లమెంటులో అన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇక్కడికి వస్తే ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబధాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.  

Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

ఇదిలాఉండగా.. మారిషస్‌కు 1968 మర్చి 12న బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. గత ఏడాది అక్కడ జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ముఖ్య అతిథిగా వెళ్లారు. అంతేకాదు గత ఏడాది నవంబర్‌లో మారిషస్ ప్రధానిగా నవీన్‌ రామ్ గూలమ్ ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఆయనకు ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. చాలా ఏళ్ల నుంచి మారిషస్‌తో భారత ప్రభుత్వం శాశ్వతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అంతేకాదు బడ్జెట్‌లో మారిషస్‌కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తోంది. 

Also Read: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్

Also Read: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

Advertisment
Advertisment
తాజా కథనాలు