PM Modi: లోక్‌సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసిన ప్రధాని మోదీ..

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభో కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేశారు. గత పదేళ్లుగా కేంద్రంపై అవినీతి ఆరోపణలు లేవని.. కొందరు శీష్ మహల్ నిర్మాణం కోసం అవినీతి చేస్తారని విమర్శించారు.

New Update
PM Modi and Arvind Kejriwal

PM Modi and Arvind Kejriwal

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభో మాట్లాడారు. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి పడేశామని పేర్కొన్నారు. '' వికసిత్ భారత్‌ సాధించడమే మా లక్ష్యం. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. గత ప్రభుత్వాలు కేవలం గరీబీ హఠావో అనే నినాదాలు చేశాయి. మరికొందరు నేతలు బంగ్లాలు కట్టుకోవడంపై దృష్టి పెట్టారు. మేము మాత్రం ప్రతీ ఇంటికి నల్లా నీరు అందించడంపై దృష్టి పెట్టాం. దేశవ్యాప్తంగా పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం.  

Also Read: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం! 

కొందరు నేతలు మాత్రం పేదల గుడిసెల వద్ద ఫొటోలు మాత్రమే దిగుతారు. సభలో పేదల గురించి మాట్లాడితే మాత్రం ఆ నేతలు మొహం విసుగ్గా పెడతారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే.. గ్రామాలకు వచ్చేసరికి 16 పైసలే ఉంటున్నాయని గతంలో ఓ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే ప్రభుత్వం ఉన్నా కూడా అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే గ్రామానికి కూడా రూపాయి చేరుతోంది. 

Also Read: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే

ప్రజల సొమ్ము ప్రజల చేతికే అనేదే మా ప్రభుత్వ నినాదం. డిజిటల్ టెక్నాలజీ ద్వారా దేశంలో పారదర్శకతను పెంచాం. 10 కోట్ల నకిలీ ఖాతాలు గుర్తించి వాటిని తొలగించాం. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వ చేశాం. గతంలో ఎప్పుడూ చూసినా రూ.లక్షల కోట్ల అవినీతిపై వార్తలు వచ్చేవి. కానీ గత పదేళ్లుగా కేంద్రంపై అవినీతి ఆరోపణలు లేవు. కొందరు శీష్ మహల్ (అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ) నిర్మాణం కోసం అవినీతి చేస్తారు. కానీ మా హయాంలో మౌలిక వసతుల కోసం భారీగా నిధులు కేటాయించాం. కేంద్రంలో గత పదేళ్లుగా అవినీతి లేకపోవడం వల్ల ప్రజలకు లాభం జరిగింది. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు వల్ల రోగులకు చాలా మేలు జరిగిందని'' ప్రధాని మోదీ అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు