Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మృతదేహాలు మోసుకెళ్తున్న పాకిస్థానీయులు-VIDEO

అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

New Update
Operation Sindoor Success

Operation Sindoor Success

అనుకున్నట్లుగానే పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ గట్టి బదులిచ్చింది. పాకిస్థాన్, POKలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై బుధవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. తాజాగా ఈ ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించిన వివరాలు కేంద్ర రక్షణశాఖ, విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

 అయితే ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాల నుంచి అక్కడి ప్రజలు మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొందరు మృతదేహాన్ని శవపేటికలో మోసుకెళ్తున్నారు. మొత్తానికి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడం అనేది పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్రంగా ఉంటోందనే విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా పాక్‌పై ఆరోపణలు వచ్చాయి. కానీ వాళ్ల బుద్ధి మాత్రం మారలేదు. 

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

మంగళవారం అర్థరాత్రి దాటాక...బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ గాఢనిద్రలో ఉన్న సమయంలో సరిగ్గా 1.44 నిమిషాలకు ఏకకాలంలో పాకిస్థాన్ లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసింది.భారత్ సైన్యం పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టింది.  ఈ తతంగమంతా కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే పూర్తయింది. పహెల్గాం దాడి తర్వాత రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాక్‌ భారత దాడులను తిప్పికొట్టే పరిస్థితి లేకపోగా.. కనీసం ఒక విమానం కూడా ప్రతిగా పైకి లేవలేదు. 9 ప్రాంతాల్లోనూ ఎక్కడ భారత సైన్యానికి ప్రతిఘటన ఎదురుకాలేదు.

Also Read: పాకిస్తాన్‌ను నాశనం చేసిన LMS డ్రోన్ .. అసలు ఇది ఎలా పనిచేస్తుంది?

telugu-news | rtv-news 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు