పాకిస్తాన్లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ ఆపరేషనక నిర్వహించింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇందులో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవలి పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన చర్యగా దీనిని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ను సాయుధ దళాలలోని మూడు విభాగాలు, అంటే సైన్యం, వైమానిక దళం, నావికాదళం కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ నిర్వహించడానికి LMS డ్రోన్ను ఉపయోగించారు. దీనిని సూసైడ్ లేదా కామికేజ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఇంతకు LMS డ్రోన్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
లాటరింగ్ మునిషన్ సిస్టమ్
LMS డ్రోన్ అంటే తక్కువ ఖర్చుతో కూడిన మినియేచర్ స్వార్మ్ డ్రోన్ లేదా లాటరింగ్ మునిషన్ సిస్టమ్. ఇది ఒక రకమైన సాయుధ డ్రోన్. పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి భారత్ దీనిని ఉపయోగించింది. ఈ డ్రోన్ దాని అద్భుతమైన సాంకేతికత, సామర్థ్యాలతో కూడుకుని ఉంది. LMS డ్రోన్లు ఎక్కువసేపు గాలిలో సంచరించగలవు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని.. లక్ష్యాలను గుర్తించి.. వాటిపై విరుచుకుపడతాయి. అందుకే దీనిని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్లు ఒకేసారి బహుళ కోణాల నుండి లక్ష్యాలపై దాడి చేయగలవు,
ఈ డ్రోన్ను భారత్ DRDO, న్యూస్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అభివృద్ధి చేసింది.వీటి ధర సాంప్రదాయ క్షిపణుల కంటే చాలా తక్కువ. ఈ డ్రోన్లలో అధిక రిజల్యూషన్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్, GPS-ఆధారిత నావిగేషన్ వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ఆపరేషన్ సిందూర్లో, NTRO (నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి ఈ డ్రోన్లకు డేటాను అందించింది. కొన్ని డ్రోన్ల వేగం గంటకు 50 మైళ్లకు పరిమితం చేయబడింది. వీటిని మొదట 1990లో ఉపయోగించారు. ఈ డ్రోన్ల పరిమాణం చాలా చిన్నది కాబట్టి వాటిని ఎక్కడైనా సులభంగా అమర్చవచ్చు.