Operation Sindoor : భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ పై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్ పాక్ సరిహద్లుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పించాలని నిర్ణయించింది కేంద్రం.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్లను హెడ్క్వార్టర్స్ చేరుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. వీరంతా ఆదివారం ఉదయం లోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల నుండి సుమారు 9వేల మందికి పైగా బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఛత్తీస్గఢ్ వైపు ఆపరేష్ కగార్ యథావిధిగా కొనసాగనుంది. ఛత్తీస్గఢ్ వైపు CRPF 217, 81, 86 బెటాలియన్లు, DRG, STF, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో యదావిధిగా కొనసాగనుంది.
Also Read: పాక్కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కూడా పలుమార్లు శాంతి చర్చల పేరుతో లేఖలు కూడా రాసింది. మావోయిస్టులతో చర్చలు జరపాలని బీఆర్ఎస్, ఇతర ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేలా ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్లో ప్రజల తిరుగుబాటు