Ratan Tata: రతన్‌ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి.. ఆ సంచలన వ్యక్తి ఎవరంటే?

దివంగత ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా వీలునామాలో రహస్య వక్తి పేరు ఉన్నట్లు సమాచారం. జంషేడ్‌ పూర్ కి చెందిన మోహినీ మోహన్ కు రూ.500కోట్లకు పైగా విరాళం ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

New Update
tata mohini

tata mohini

దివంగత ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా వీలునామాలో రహస్య వక్తి పేరు ఉన్నట్లు సమాచారం. జంషేడ్‌ పూర్ కి చెందిన మోహినీ మోహన్ కు రూ.500కోట్లకు పైగా విరాళం ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. టాటా వీలునామాలో వచ్చిన మోహిని మోహన్ దత్తా అనే పేరు టాటా కుటుంబంలో, వ్యాపార వర్గాలలో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 

రతన్ టాటా వీలునామాలో ఏముందంటే!

2024 అక్టోబర్‌లో మరణించిన రతన్ టాటా, తన ఆస్తిలో మూడింట ఒక వంతును దత్తాకు ఇచ్చేలాగా వీలునామాను రాశారు. మిగిలిన ఆస్తిని టాటా సవతి సోదరీమణులు షిరీన్ జెజీభాయ్, డీనా జెజీభాయ్ లకు రాశారు. వారు వీలునామా అమలుదారులుగా కూడా పనిచేస్తున్నారు. అయితే, రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం ఆయన తన చివరి సంవత్సరాల్లో స్థాపించిన రెండు సంస్థలు - రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్,  రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది.

Also Read: interpoll: అమెరికా నుంచి వచ్చిన వలసదారుల్లో ఇంటర్‌పోల్‌ మోస్ట్‌ వాంటెడ్ నేరగాడు!

మోహినీ మోహన్ దత్తా వాదన

ఇదిలా ఉంటే మోహిని మోహన్ దత్తా వాదన ఇతర వాటాదారులతో విభేదాలకు దారితీసిందని సమాచారం. వీలునామాలో ఉన్న దానికంటే కూడా ఎక్కువ వాటాను దత్తా డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే దీని గురించి పూర్తి సమాచారం మాత్రం లేదు.

Also Read: Hyderabad: రూ.99 కే హైదరాబాద్‌- విజయవాడకి ఈవీ బస్సుల్లో ప్రయాణం..పూర్తి వివరాలు ఇవే!

అసలేవరీ మోహినీ మోహన్ దత్తా ?

దత్తా జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యక్తి. రతన్‌ టాటా ప్రయాణంలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నాడు. అతని కుటుంబం ఒకప్పుడు స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉంది, ఈ సంస్థలో టాటా ఇండస్ట్రీస్ 20% వాటాను కలిగి ఉంది. 2013లో, స్టాలియన్ టాటా గ్రూప్ హాస్పిటాలిటీ విభాగంలో ఒక విభాగమైన తాజ్ గ్రూప్  ట్రావెల్ సర్వీసెస్‌లో విలీనం చేశారు. థామస్ కుక్ (ఇండియా)తో అనుసంధానమైన కంపెనీ  TC ట్రావెల్ సర్వీసెస్‌కు దత్తా డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

రతన్ టాటాతో దత్తా మొదటిసారి జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్‌లో కలిసినప్పటి నుండి. ఆ సమయంలో, రతన్ టాటా వయస్సు  24 సంవత్సరాలు. అక్టోబర్ 2024లో, దత్తా వారి బంధాన్ని వివరిస్తూ, "రతన్ టాటా నాకు సహాయం చేసి జీవితంలో నన్ను ముందుకు నడిపించారు. మేము ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రయాణంలో ఉన్నామని అన్నారు.

మోహిని మోహన్ దత్తా-రతన్ టాటా సంబంధం

టాటా సర్కిల్‌లోని కొందరు దత్తాను రతన్ టాటా "దత్తపుత్రుడు"గా అభివర్ణించినప్పటికీ, టాటా ఎప్పుడూ వివాహం చేసుకోలేదని లేదా పిల్లలను దత్తత తీసుకోలేదని వీలునామాలో స్పష్టంగా ఉంది. ఎస్టేట్ పంపిణీ గురించి చర్చలు కొనసాగుతున్నందున ఈ స్పష్టత కేంద్ర బిందువుగా మారవచ్చు.

టాటా గ్రూప్‌తో దత్తా కుటుంబ సంబంధాలు మరింత విస్తరిస్తాయి. ఆయన ఇద్దరు కుమార్తెలలో ఒకరు టాటా ట్రస్ట్స్‌లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు. గతంలో తాజ్ హోటల్స్‌లో ఉద్యోగం చేశారు. రతన్ టాటా జయంతిని పురస్కరించుకుని 2024 డిసెంబర్‌లో ముంబైలోని NCPAకి దత్తాను ఆహ్వానించారు, ఇది టాటా కుటుంబంతో ఆయనకున్న సన్నిహిత అనుబంధాన్ని నొక్కి చెబుతుంది.

రతన్ టాటా వీలునామా దాతృత్వం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రాథమిక ఆస్తులు ధార్మిక సంస్థలకు అప్పగించడం జరిగాయి.అయితే, మోహిని మోహన్ దత్తా కీలక లబ్ధిదారుడిగా ఆవిర్భావం టాటా గ్రూప్‌లో గణనీయమైన చర్చలకు దారితీసింది. పారిశ్రామికవేత్త సంపదను విభజించడంలో సంక్లిష్టతలపై దృష్టిని ఆకర్షించింది. వీలునామాకు అనుగుణంగా పంపిణీ ప్రక్రియ ఎలా నిర్వహించడం జరుగుతుందనే దానిపై న్యాయ నిపుణులు ఇప్పుడు దృష్టి పెట్టారు.

Also Read: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

Also Read:America-Trump: ఆ సంస్థలో 9700 మందికి ఉద్వాసన పలికిన ట్రంప్‌ సర్కార్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు