BIG BREAKING: అరుణాచల్ ప్రదేశ్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో ఆదివారం ఉదయం 05:06:33 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.8 గా నమోదైంది. కాగా భూకంపం దిబాంగ్ లోయలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదించింది. దీని ఖచ్చితమైన స్థానం లాటిట్యూడ్ 29.03 N, లమర్టిచ్యూడ్ 95.78 E వద్ద ఉదని ఎన్సీఎస్ తెలిపింది.
An earthquake with a magnitude of 3.8 on the Richter Scale hit Dibang Valley, Arunachal Pradesh at 05:06:33 IST today: National Center for Seismology pic.twitter.com/n7NntxFpKY
— ANI (@ANI) May 18, 2025
Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?
అయితే ఈ భూకంపం చాలా తక్కువ తీవ్రత కలిగిందని దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. అయితే తెల్లవారుజామునే భూమి కంపించడంతో భూ ప్రకంపణలకు ప్రజలు ఆందోళను గురయ్యారు. కాగా భూకంపం సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో విధుల్లోకి పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దాన్ని భూంకంపంగా నిర్ధారించడంతో పాటు ఎటువంటి ప్రమాదం లేదని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
ఇండోనేషియాలోని సుమత్రాలో కూడా భూకంపం సంభవించింది. సుమత్రాలో భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 2:50 గంటలకు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 58 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. సుమత్రాలో భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం