Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా

భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన దౌత్య ఫలితమే ఇదంతా అని తెలుస్తోంది. 

New Update
india

Big Diplomatic Win, Colombia Withdraws Statement

ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలకు దాని గురించి వివరించడానికి భారత దౌత్య బృందం వెళ్ళింది. ఇందులో కాంగ్రెస్ నేత శశిథరూర్ బృందం కొలంబియా వెళ్ళారు. ఇందులో భాగంగా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొలంబియా ప్రభుత్వం తమ ప్రకటనను వెనక్కు తీసుకుంది. 

పరిస్థితిపై అవగాహన వచ్చింది..

ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలను తెలిపేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తోంది. అందులో భాగంగా కొలంబియాకు శశిథరూర్ బృందం వెళ్ళింది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావిసెన్సియోతో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన పూర్తి విషయాలను ఆయన తెలియజేశారు. దీని తరువాత యెలాండ్ తమ ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత బృందం తమకు అన్ని విషయాలను తెలిపిందని...కాశ్మీర్ లో ఏం జరిగిందో పూర్తి తెలుసుకున్నామని చెప్పారు. దాడులు ఎందుకు జరిగాయో, పరిస్థితి అవగాహనకు వచ్చిందని చెప్పారు. యెలాండ్ ప్రకటన తర్వాత కొలంబియా ప్రభుత్వానికి శశిథరూర్ కృతజ్ఞతలు తెలిపారు. 

 

Also Read: India-Turkey: టర్కీతో మరో తెగతెంపులు..టర్కిష్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యం రద్దు

Advertisment
Advertisment
తాజా కథనాలు