ముదురుతున్న భాషా వివాదం.. మారాఠీ రాదన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతోంది. ఇటీవల ఓ ఆటో డ్రైవర్‌ తనకు మరాఠీ రాదని.. హిందీనే మాట్లాడుతానని అన్నాడు. దీంతో తాజాగా శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కార్యకర్తలు అతడిపై దాడి చేశారు.

New Update
Migrant Auto Driver Beaten In Maharashtra

Migrant Auto Driver Beaten In Maharashtra

మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతోంది. ఇటీవల ఓ ఆటో డ్రైవర్‌ తనకు మరాఠీ రాదని.. హిందీనే మాట్లాడుతానని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తాజాగా ఉద్ధవ్, రాజ్‌ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి ఆటో నడుపుతూ విరార్‌లో ఉంటున్నాడు. 

Also Read: భారత్‌ అరుదైన ఘనత.. WHO నివేదికలో ప్రత్యేక గుర్తింపు

కొన్ని రోజుల క్రితం విరార్ స్టేషన్ దగ్గర్లో యూపీ నుంచి వలస వచ్చిన యువకుడు, ఆ ఆటో డ్రైవర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరాఠీలో మాట్లాడాలని ఆ యువకుడు అడగగా దీనికి ఆ ఆటో డ్రైవర్‌ నిరాకరించాడు. నాకు మరాఠీ రాదు.. హిందీలో మాట్లాడుతా, భోజ్‌పురిలో మాట్లాడుతా అంటూ అరిచాడు. అయితే వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.  

Also Read: విదేశాల నుంచి భారీగా నిధులు..అక్రమంగా మతమార్పిడులు..చంగూర్‌బాబా కేసులో సంచలన విషయాలు

దీంతో శివసేన (UBT), మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS) కార్యకర్తలు శనివారం విరార్‌ స్టేషన్‌ సమీపంలో ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్నారు. మరాఠీ భాషను అవమానిస్తావా అంటూ అతడిని కొట్టారు. మహిళా కార్యకర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. చివరికి అతడు క్షమాపణలు చెప్పాడు. మరోవైపు దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు