Maha kumbh Mela Special Trains: నేటితో ముగియనున్న మహా కుంభమేళా.. 350 స్పెషల్ ట్రైన్స్!

మహా కుంభమేళా చివరి రోజుకు చేరుకుంది. దీంతో అమృత స్నానం తర్వాత యాత్రికులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లు వేసింది. ప్రయాగ్‌రాజ్ నుండి 350కి పైగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

New Update
Maha Kumbh Mela 2025 last date 350 special trains arranged

Maha Kumbh Mela 2025 last date 350 special trains arranged

మహా కుంభమేళా చివరి రోజుకు చేరుకుంది. దీంతో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు పోటెత్తుతున్నారు. పౌష్ పూర్ణిమ మొదటి అమృత స్నానం జనవరి 13న ప్రారంభమైంది. ఆ తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి నాడు స్నానం, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ నాడు భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా చివరి స్నానం చేసేందుకు లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు.

Also Read: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

63.36 కోట్లకు పైగా భక్తులు

ఇవాళ్టితో ఈ ఆధ్యాత్మిక వేడుక పూర్తి కానుండటంతో మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికి ఈ ఉత్సవానికి దాదాపు 63.36 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక ఇవాళ 1.30 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. 

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

గిన్నిస్ వరల్డ్ రికార్డ్

ఇక మహా కుంభమేళా చివరి రోజున భక్తుల భారీ రాకను ముందే ఊహించిన యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశుధ్యం, పరిశుభ్రత ప్రయత్నాలు అమలు చేసింది. అనేక వేదికలలో జరిగిన శుభ్రతా కార్యక్రమంలో దాదాపు 15,000 మంది పారిశుధ్య కార్మికులు పాల్గొని కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అయితే ఈ రికార్డు తుది ఫలితాలు ఫిబ్రవరి 27న ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

350కి పైగా స్పెషల్ రైళ్లు

అదే సమయంలో భారతీయ రైల్వేలు మహా శివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఫిబ్రవరి 26న జరిగే మహా కుంభ్ 2025 చివరి అమృత స్నానం తర్వాత యాత్రికులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా స్పెషల్ ట్రైన్లు వేసింది. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ నుండి 350కి పైగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. 

ఇక మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ జిల్లా యంత్రాంగం.. అదనపు బలగాలను ఏర్పాటు చేసింది. మెరుగైన నిర్వహణ కోసం రైల్వే, విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు