/rtv/media/media_files/2025/05/30/i1NOjp16TZSS8IMO6SgJ.jpg)
Maharashtra due to 5 days of heavy rains 16 people died
Heavy Rains: గత కొద్ది రోజులుగా వర్షాలు దుమ్ము దులిపేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వాన జల్లులు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా కుండపోత వర్షాలకు చెట్లు విరిగి రోడ్లు పై పడిపోయాయి. దీంతో కరెంట్ వైర్లు తెగి విద్యుత్ సప్లైకు అంతరాయం కలిగింది. అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
భారీ వర్షానికి 16 మంది మృతి
ఇందులో భాగంగానే గత 5 రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 16 మంది మృతి(16 people died) చెందారు. మహారాష్ట్రలో గత ఐదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం, నిర్మాణాలు కూలిపోవడం, చెట్లు విరిగిపోవడం సహా మరిన్ని సంఘటనల కారణంగా 16 మంది మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
మే 24వ తేదీ నుంచి మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందులో భాగంగా పూణే జిల్లాలో ముగ్గురు మరణించగా.. లాతూర్, థానే, భండారాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
అదే సమయంలో అహల్యానగర్, నాగ్పూర్, రాయ్గడ్, ముంబై సబర్బన్, వార్ధా, చంద్రపూర్, గోండియా జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా మే 24 నుంచి కురిసిన భారీ వర్షాలకు మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అదే సమయంలో 41 జంతువులు మరణించాయని వాతారణ శాఖ తెలిపింది.