/rtv/media/media_files/2025/04/10/OYUsMcODXl0SCYglcFE1.jpg)
Killed In Lightning Strikes, Hailstorms In Several Districts Of Bihar
బీహార్లో వడగళ్ల వాన తీవ్ర విషాదం నింపింది. పలుచోట్ల ఉరుములు మెరుపుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు పడిన ఘటనలో 25 మంది మృతి చెందారు. ఒక్క నలంద జిల్లాలోనే 19 మంది మృతి చెందినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. సివాన్లో ఇద్దరు, కఠిహార్, బెగుసరాయ్, భాగల్పుర్, బెగుసరాయ్, జహానాబాద్లో ఒక్కోక్కరు మృతి చెందారు.
Also Read: భార్యపై అనుమానంతో బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. టెక్ బిలియనీర్ కేసులో భయంకర నిజాలు!
మరోవైపు బాధిత కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇదిలాఉండగా బుధవారం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల పరిధిలో పిడుగుల పడి 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరికొన్ని చోట్ల పిడుగుల ధాటికి మృతులు సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక బీహార్ అధికార లెక్కల ప్రకారం 2023లో పిడుగుల వల్ల ఆ రాష్ట్రంలో 275 మంది మృతి చెందారు.
Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
Also Read: హర్యానా బీజేపీ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ MLA వినేష్ ఫొగట్కు రూ.4 కోట్లు
Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు