Golden Temple : అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో ఖలిస్థానీలు.. నినాదాలతో కలకలం

ఆపరేషన్ బ్లూ స్టార్ 41వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. భింద్రన్‌ వాలే వర్ధంతి సందర్భంగా సిమ్రన్‌జీత్‌ సింగ్, ఆయన అనుచరులు స్వర్ణ దేవాలయానికి చేరుకుని ఖలిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.

New Update
Amritsar's Golden Temple

Amritsar's Golden Temple

Golden Temple : ఆపరేషన్ బ్లూ స్టార్ 41వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. స్వర్ణదేవాలయంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు 1984 జూన్‌ 1-10 వరకు ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పేరుతో పోలీసులు దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా పలువురు సిక్కులు మరణించారు. ఆ సమయంలో ఇదే  రోజున జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే కూడా చనిపోయాడు. భింద్రన్‌ వాలే వర్ధంతి సందర్భంగా  సిమ్రన్‌జీత్‌ సింగ్, ఆయన అనుచరులు స్వర్ణ దేవాలయానికి చేరుకున్నారు.

Also Read: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సీక్రెట్ మ్యారేజ్.. నెట్టింట వైరల్

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

స్వర్ణ దేవాలయంలో SAD (మన్ వర్గం) నాయకుడు సిమ్రంజిత్ సింగ్ మాన్ సిక్కుల పవిత్ర స్థలానికి చేరుకున్నప్పుడు 'ఖలిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేశారు. ఆయనతో పాటు  ఆయన అనుచరులు ఖలిస్థాన్‌ జిందాబాద్‌ నినాదాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. అప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులు మొహరించారు.

Also Read: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి

Also Read: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. 2,200 మంది అరెస్ట్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు