Wayanad: వాయనాడ్‌లో 48 గంటల పాటు కర్ఫ్యూ.. అసలు కారణమేంటి?

కేరళలోని వాయనాడ్‌లో ప్రభుత్వం 48 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఓ మహిళపై దాడి చేయడంతో పాటు అటవీ శాఖ అధికారిపై కూడా పులి దాడి చేయడంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు. పులి కనిపించిన వెంటనే కాల్చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

New Update
Tiger roaming in Sangareddy:సంగారెడ్డిలో పులి సంచారం.. ఆవు మెడను కొరికి చంపిన పులి!

Tiger

కేరళలోని వాయనాడ్‌లో 48 గంటల పాటు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఈ కర్ఫ్యూని ప్రారంభించింది. ఓ మహిళపై పులి దాడి చేయడంతో.. దాన్ని పట్టుకోవడానికి కర్ఫ్యూ విధించారు. మనత్‌వాడి ప్రాంతంలో ప్రియదర్శిని ఎస్టేట్‌లో రాధ అనే మహిళ కాఫీ తీస్తుండగా.. ఆమెపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో పులిని చంపాలని రాధ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేశారు. దీంతో ఈ పులిని పట్టుకోవడం కోసం వాయనాడ్‌లో కర్ఫ్యూ విధించారు. 

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

అటవీ శాఖ అధికారిపై కూడా దాడి చేయడంతో..

ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం దాడి చేసిన పులిని మ్యాన్​ఈటర్‌గా ప్రకటించింది. ఈ పులి ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ పులి కేవలం రాధ అనే మహిళపైనే మాత్రమే కాకుండా జయసూర్య అనే అటవీ శాఖ అధికారిపై కూడా ఈ పులి దాడి చేసింది. ప్రజలపై వరుసగా ఇలా దాడులు జరగడంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే

 

Advertisment
Advertisment
తాజా కథనాలు