/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/puli-jpg.webp)
Tiger
కేరళలోని వాయనాడ్లో 48 గంటల పాటు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఈ కర్ఫ్యూని ప్రారంభించింది. ఓ మహిళపై పులి దాడి చేయడంతో.. దాన్ని పట్టుకోవడానికి కర్ఫ్యూ విధించారు. మనత్వాడి ప్రాంతంలో ప్రియదర్శిని ఎస్టేట్లో రాధ అనే మహిళ కాఫీ తీస్తుండగా.. ఆమెపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో పులిని చంపాలని రాధ కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేశారు. దీంతో ఈ పులిని పట్టుకోవడం కోసం వాయనాడ్లో కర్ఫ్యూ విధించారు.
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
വയനാട് പഞ്ചാരക്കൊല്ലിയിലെ നരഭോജി കടുവയെ വെടിവെച്ച് കൊല്ലാനുള്ള ദൗത്യം ഇന്ന് മുതൽ ആരംഭിക്കും. കടുവയെ വെടിവെച്ചുക്കൊല്ലാൻ സജീവമായി വനംവകുപ്പ്. 80 അംഗ ആർആർടി 10 സംഘങ്ങളായി കടുവയെ പിടികൂടാൻ പ്രദേശത്ത് തിരച്ചിൽ ശക്തമാക്കും#wayanad #pancharakolly #TigerAttack #Curfew #newsmalayalamtv pic.twitter.com/JJdSD8L4F2
— News Malayalam 24x7 (@newsmalayalamtv) January 27, 2025
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
అటవీ శాఖ అధికారిపై కూడా దాడి చేయడంతో..
ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం దాడి చేసిన పులిని మ్యాన్ఈటర్గా ప్రకటించింది. ఈ పులి ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ పులి కేవలం రాధ అనే మహిళపైనే మాత్రమే కాకుండా జయసూర్య అనే అటవీ శాఖ అధికారిపై కూడా ఈ పులి దాడి చేసింది. ప్రజలపై వరుసగా ఇలా దాడులు జరగడంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి:UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే