/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)
Karregutta oparation Maoists gone to safe zones
Maoist: మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. ‘బచావో కర్రె గుట్టలు’ పేరిట తెలంగాణ, ఏపీ, ఛత్తీష్ గఢ్, కేంద్ర బలగాలు సంయుక్తంగా చేప్టటిన ఆపరేషన్ కీలక మలుపులు తిరుగుతోంది. వేల సంఖ్యలో బలగాలు కర్రెగుట్టను జల్లెడపడుతున్నాయని, డ్రోన్ల సహాయంతో మావోయిస్టులను గుర్తించినట్లు ప్రకటించాయి. అంతేకాదు 30 మందికి పైగా హతమార్చినట్లు మిలటరీ బలగాలు వెల్లడించాయి. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఎత్తుకు పై ఎత్తులు..
ఈ మేరకు బలగాలను డైవెర్ట్ చేసేందుకు మావోయిస్టులు కర్రె గుట్టను పావుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్ట ఆపరేషన్ డ్రామాతో అగ్రనేతలంగా సేఫ్జోన్లకు వెళ్లిపోయినట్లు చర్చనడుస్తోంది. ఆపరేషన్ మొదలై 9 రోజులు గడుస్తున్నా కర్రె గుట్టలపై నక్సలైట్ల జాడ కానరాకపోవడంపై ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ డైవెర్షన్ మైండ్ గేమ్ ఆడిన మావోయిస్టులు ప్రస్తుతం ఉత్తర దండకారణ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్ కగార్' పేరుతో బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచగా ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనాయకులను కోల్పోయి భారీగా నష్టపోయింది. దీంతో ఎలాగైనా పార్టీ కేడర్ను కాపాడుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తప్పించుకుంటోంది. ఇందులో భాగంగానే కొత్త ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
పార్టీ ఉనికే లక్ష్యంగా సేఫ్ జోన్లకు..
మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సానుకూల ప్రకటన చేయట్లేదు. దీంతో పార్టీ ఉనికే లక్ష్యంగా సరిహద్దులు దాటి మావోయిస్టులు సేఫ్ జోన్లకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ, బస్తర్, ఏఓబీ తర్వాత నాలుగో గెరిల్లా జోన్గా కర్ణాటక –కేరళ–తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాన్ని మావోయిస్టు పార్టీ 2011లో ప్రకటించింది. 2014 వరకు ఈ జోన్లో పొలిటికల్ మిలిటరీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. కానీ అక్కడ ఊహించిన ఫలితాలు లేకపోగా అగ్రనాయత్వాన్ని కోల్పోయింది. కొంతమంది లొంగిపోవడం, కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్– మహారాష్ట్ర– ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాన్ని గెరిల్లా జోన్–5గా 2015లో ప్రకటించింది. కానీ ఇక్కడ కూడా ఆశించిన రిజల్ట్ లేకపోవడంతో ఇప్పుడు కొత్త ప్రాతంలోకి తరలివెళ్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Also Read: అత్యాచారం చేసిన యువతినే పెళ్లిచేసుకున్న ఖైదీ.. జైల్లో ఉండగానే ట్విస్ట్ అదిరింది!
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని కన్నూరు, కోజికోడ్, వయనాడ్ జిల్లా అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు షెల్టర్ జోన్లుగా మారాయని నిఘా వర్గాల అంచనా వేస్తున్నాయి. తెలంగాణకు చెందిన గణేశ్ ఆలియాస్ పాక హనుమంతు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమంది మహారాష్ట్ర గోండియా, మధ్యప్రదేశ్లో బాల్ఘాట్, ఛత్తీస్గఢ్లో రాజ్నంద్గావ్ జిల్లాలకు తరలివెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. కన్హా నేషనల్ పార్క్, భరాన్దేవ్ టైగర్ రిజర్వ్, అమర్కంటక్ అడవులు కూడా మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మావోయిస్టు సానూభూతి పరులు ఉన్నారని, వారి సహకారంతో పార్టీ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారనే సమాచారంతో బలగాలు నిఘా పెడుతున్నాయి. మరికొంతమంది మావోయిస్టులు జార్ఖండ్, బీహార్– బెంగాల్ మీదుగా వివిధ మార్గాల్లో విదేశాలకు తరలివెళ్తున్నారనే సమాచారం కూడా ఉంది.
Also Read: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
police bjp