Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా బట్టేరే చాష్మా వద్ద ఈ ఘటన జరిగింది.

New Update
Jammu Kashmir Army Vehicle Falls Into Gorge 3 Soldiers Killed

Jammu Kashmir Army Vehicle Falls Into Gorge 3 Soldiers Killed

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ (ఆదివారం) ఉదయం ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా బట్టేరే చాష్మా వద్ద ఈ ఘోరమైన ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

Also Read :  గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేసిన శోభన్ బాబు మనవడు.. ల్యాపరోస్కోపితో అరుదైన శస్త్ర చికిత్స

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

ఘోర ప్రమాదం

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

రాంబన్ జిల్లాలోని బట్టేరే చాష్మా  దగ్గర నేషనల్ హైవే 44 వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో సైనికుల వాహనం అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న 700 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ వాహనం నుజ్జు నుజ్జు అయింది. అందులో ఉన్న జవాన్లు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

అందులో ముగ్గురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక మృతులలో సుజీత్ కుమార్, అమిత్ కుమార్, మన్ భదూర్ గా గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో భిన్న వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Also Read :  పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ కన్నుమూత

Jammu and Kashmir | road-accident

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు