/rtv/media/media_files/2025/05/04/ZpgGEyLCStDFeN4MMOLQ.jpg)
Dr. Surakshith Battina
Dr Surakshith Battina నట భూషణ శోభన్ బాబు వైవిధ్యమైన పాత్రలు, అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆయన లాగే ఆయన వారసులు కూడా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశారు. ఇటీవలే సురక్షిత్ చెన్నైలో ‘ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్' ద్వారా భారీ సిస్ట్ ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 2019లో డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ శస్త్ర చికిత్స ద్వారా తొలగించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సాధించారు. ఇప్పుడు సురక్షిత్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఈ అరుదైన ఆపరేషన్ గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతిపాదనకు కూడా వెళ్ళింది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్...ఇద్దరు ఇంటి దొంగల అరెస్ట్
8 గంటల పాటు సర్జరీ
అయితే 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో పెద్ద సిస్ట్ ఏర్పడడంతో.. ఆమె కొంతకాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంది. ఎన్ని ఆస్పత్రులు సంప్రదించినా.. దానిని తొలగించడం కష్టమని, ఓపెన్ సర్జరీ తప్పా మరో మార్గం లేదని చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్ సురక్షిత్ ని సంప్రదించగా.. ఓపెన్ సర్జరీ లేకుండా.. 3డీ ల్యాపరోస్కోపీతో చాకచక్యంగా భారీ కణితి ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టార్ సురక్షిత్.
Also Read : జీతాల్లేక కాలేజీల మూత.. ఫీజు రీయింబర్స్మెంట్పై హరీశ్ రావు ఫైర్
/rtv/media/media_files/2025/05/04/mKxmogB9duUiQ13iUF4z.png)
ఈ సందర్భంగా డాక్టర్ సురక్షిత్ మాట్లాడుతూ.. ఇలాంటి ఆపరేషన్లు చేయడంలో మా గురువు డాక్టర్ రాకేష్ సిన్హా ఎక్స్ పర్ట్. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ సాహసం చేశాను అని చెప్పారు. అయితే 2019లో డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సాధించార అని తెలిపారు.
Also Read : ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ...30 నిమిషాలపాటు దానిపైనే చర్చ...
/rtv/media/media_files/2025/05/04/oHCywVkHfhvgQfKpgz4D.jpg)
సురక్షిత్ తన కెరీర్ లో 10వేలకు పైగా సర్జరీలు చేశారు. ఎన్నో క్లిష్టమైన కేసులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. సురక్షిత్ 2016 చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ను స్థాపించారు. ఆ సమయంలోనే ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా రోగులు త్వరగా కోలుకునేలా చేశారు.
Also Read : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
latest-news | telugu-news | life-style