Jagdeep Dhankhar: న్యాయవాది నుంచి ఉప రాష్ట్రపతి దాకా.. జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ గురించి ఆసక్తిర విషయాలు

ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. అయితే అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నటు ఆ లేఖలో వెల్లడించారు.

New Update
Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. అయితే అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నటు ఆ లేఖలో వెల్లడించారు. దీంతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు. 2022 ఆగస్టు 11న జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027 ఆగస్టు వరకు ఆయనకు ఈ పదవీ కాలం ఉంది. కానీ మూడేళ్లకే ఆయన పదవి నుంచి వైదొగాలని నిర్ణయం తీసుకున్నారు.  

జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఎవరు ?

జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కిఠానోలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. చిత్తోడ్‌గఢ్‌లో సైనిక పాఠశాలలో స్కాలర్‌షిప్‌ చదువు పూర్తి చేశారు. ఆయనకు స్కూల్లో ఉన్నప్పుడే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. ఆధ్యాత్మికత, ధ్యానంపై కూడా మక్కువ ఉండేది. ముందుగా ఆయన రాజస్థాన్‌లోనే న్యాయవాదిగా పనిచేశారు. గతంలో సల్మాన్‌ ఖాన్ కృష్ణ జింకల కేసును కూడా ధన్‌ఖడ్‌ వాదించారు. ఆయనకు బెయిల్‌ ఇప్పించేందుకు ఈయనే కీలక పాత్ర పోషించారు. 

Also Read: 150 లగ్జరీ కార్లు కొట్టేసి.. 20 ఏళ్లుగా ఎంజాయ్..చివరికి

1990 రాజస్థాన్‌ హైకోర్టులో ధన్‌ఖడ్‌కు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన ఎక్కువగా బొగ్గు, మైనింగ్, ఉక్కు, ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కేసులు వాదిస్తుండేవారు. ఇక 2019లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు ఆయన వివిధ హైకోర్టుల్లో కేసులు వాదించారు.

జాట్‌లను ఓబీసీలోకి చేర్చేందుకు కృషి 

1989 నుంచి 1991 వరకు 9వ లోక్‌సభలో జనతాదళ్ సభ్యుడిగా రాజస్థాన్‌లోని ఝుంఝును లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1991లో కాంగ్రెస్‌లో చేరి అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1993 నుండి 1998 వరకు రాజస్థాన్ 10వ శాసనసభలో పనిచేశారు. జాట్‌లను ఓబీసీలో చేర్చేందుకు ఆయన చాలా కృషి చేశారు. 

Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు

జగ్‌దీప్ ధన్‌ఖడ్ 1998లో లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఝుంఝును నియోజకవర్గం నుండి పోటీ చేసి, మూడవ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 2003లో బీజేపీలో చేరారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2019–2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ ‌గా సేవలందించారు. ఇక చివరకి 2022 ఆగస్టు 11న జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన రాజీనామాతో తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్, జేడీయూ నేత హరివంశ్‌కు ఇస్తారా ? లేదా ఇంకెవరికైనా ఇస్తారా అనేదానిపై చర్చలు నడుస్తున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు