/rtv/media/media_files/2025/05/30/D6UZZf8f0fue1bL74nHr.jpg)
Pakistan PM Sehbaz Sharif
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాద్ షరీఫ్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్.. సిందూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా, అక్రమంగా నిలివేయడం తీవ్రంగా చింతించే విషయమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజల జీవితాలు త్యాగం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్థాన్ దీన్ని అంగీకరించదని'' షెహబాజ్ షరీఫ్ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ అప్పటినుంచి వ్యతిరేకిస్తూనే వస్తుంది.
Also Read: 'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Sehbaz Sharif Warnings To India
భారత్, పాక్ మధ్య కాల్పులు విరమణ జరిగిన తర్వాత ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి దీనిపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తజికిస్థాన్లో 'హిమానీనదం రక్షణ'పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
بھارت کا سندھ طاس معاہدے کو یکطرفہ اور غیر قانونی طور پر معطل کرنا انتہائی افسوسناک ہے۔ لاکھوں انسانوں کی زندگیاں سیاسی مفادات کی نظر نہیں کی جا سکتیں، پاکستان اس اقدام کو کسی صورت قبول نہیں کرے گا۔
— Shehbaz Digital Media (@ShehbazDigital) May 30, 2025
~ وزیرِاعظم محمد شہباز شریف #PMShehbazInTajikistan 🇵🇰🇹🇯 pic.twitter.com/vyuuSDZDTu
Also Read: ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. భర్త ప్రైవేట్ పార్ట్ కొసేసిన భార్య.. కారణం తెలిస్తే షాకే!
భారత్ దాడులతో కాళ్ళ బేరానికి వచ్చిన పాక్.. మళ్ళీ వెనుక నుంచి గోతులు తవ్వేందుకు యత్నిస్తోంది. ఇందుకు నిదర్శనమే పాకిస్తాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ర్యాలీలు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్తో పాటు నిషేధిత సంస్థ జమాత్-ఉద్-దవా పాకిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలాంటి వాటితో సహా మొత్తం 50 నగరాల్లో ఈ ర్యాలీలను నిర్వహించింది. దీనిలో పాక్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ కూడా పాల్గొంటోంది. భారత్కు వ్యతిరేకంగా చేస్తున్నర్యాలీలో ఉగ్రవాదులు కూడా పాల్గొనడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
Also Read : హైదరాబాద్లో దారుణం.. స్నేహితుడి ప్రాణం తీసిన డబ్బులు
shehbaz-sharif | pm shehbaz sharif | telugu-news | indus water | Indus Waters Treaty