/rtv/media/media_files/2025/05/30/nKYdMIy6QivYi3ccNGNx.jpg)
UP Sambhal Wife Cut Husband Private part
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భార్య చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. దంపతులిద్దరూ గొడవ పడగా.. భర్త ప్రైవేట్ పార్ట్ను కత్తితో భార్య కట్ చేసేసింది. అక్కడితో ఆగకుండా అతడి నాలుకను సైతం తన నోటితో కొరికేసింది. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: కమల్ హాసన్కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
భర్త ప్రైవేట్ పార్ట్ కోసేసిన భర్య
యూపీలోని సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో దంపతులు నివశిస్తున్నారు. భర్త తన భార్య సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి పదే పదే నిరాకరించాడు. ఇదే విషయంపై భార్య, భర్తల మధ్య గొడవ చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య తన భర్తపై దాడికి దిగింది. ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్ను కొసేసింది. అక్కడితో ఆగకుండా అతడి నాలును సైతం తన నోటితో కొరికేసింది.
Also Read: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు అదిరిపోయాయ్!
తీవ్ర గాయాలతో అతడు గట్టిగా అరవడంతో పొరుగువారు ఇంట్లోకి వచ్చి దాడిని ఆపారు. అదే సమయంలో ఆ మహిళ కూడా అనుమానాస్పద స్థితిల్లో యాసిడ్ తాగి పడిపోయింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మొరాదాబాద్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. తన భార్య తనను చంపాలనుకుందని, కానీ పొరుగువారు తనను కాపాడారని చెప్పాడు.
Also Read: హైదరాబాద్లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
ఇక ఈ దాడి సమయంలో కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారని, లేకుంటే తన భార్య తనను చంపేసేదని బాధితుడు తెలిపాడు. ఎందుకంటే ఆమె చేతిలో అప్పటికే కత్తి ఉందని, దానితో ఆమె తన ప్రైవేట్ పార్ట్ కోసిందని, ఆమె నోటితో తన కాలును కొరికిందని.. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయాను అని చెప్పాడు. మరోవైపు ఆ మహిళ సోదరుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. కట్నం డిమాండ్ను తీర్చలేదని, తన సోదరిని కొట్టి బలవంతంగా యాసిడ్ తాగించాడని ఆమె భర్తతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశాడు.