/rtv/media/media_files/2025/05/30/wPiIIX6D9Z92qzOKvo0S.jpg)
Bayya Sunny Yadav Issue
Bayya Sunny Yadav Issue: హర్యానాలోని హిసార్కు చెందిన 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Travel Vlogger Jyoti Malhotra) గూఢచర్య కేసు(Espionage Case)లో చిక్కుకున్న విషయం తెలిసిందే. యూట్యూబర్(Youtuber) మూసుగులో పాకిస్తాన్కు గూఢచారం వహించిన జ్యోతి మల్హోత్రాను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా జ్యోతి ఇప్పటికి మూడుసార్లు పాక్ దేశం వెళ్లి రావడంతో అధికారులు తీవ్ర స్థాయిలో ఆమెను విచారిస్తున్నారు. అలాగే ఇటీవల ఆమెకు సంబందించిన పలు వీడియోలు తెగ వైరల్గా మారాయి.
Also Read: USA: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు
అందులో ముఖ్యంగా ఆమె పాక్లోని లాహోర్లో కొంతమంది గన్మ్యాన్ల మధ్య నడుచుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. దీంతో పాకిస్తాన్(Pakistan) అధికారులతో జ్యోతికి ఉన్న సంబంధాల గురించి బోలెడన్ని ప్రశ్నలు లేవనెత్తాయి. దీంతో పోలీసులు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: కమల్ హాసన్కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
బయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ (Bayya Sunny Yadav Arrest)
ఇందులో భాగంగానే తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మరొక యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు(Bayya Sunny Yadav Arrest). సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం శిల్పకుంట్ల గ్రామానికి చెందిన సన్నీని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒక వ్లాగర్ (వెళ్లిన ప్రాంతాల్లో పరిస్థితులను వివరించి వీడియోలు చేయడం). గత మూడు, నాలుగేళ్ల నుంచి దేశ, విదేశాల్లో బైక్ రైడ్స్ చేస్తూ వీడియోలు చేసి తన యూట్యూబ్లో పెడుతున్నాడు.
ఈ క్రమంలోనే బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో చిక్కుకున్నాడు. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్స్(Betting Apps Promotions) చేయడంతో అతడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో అతడికి నోటీసులు కూడా అందాయి. అదే సమయంలో సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.
Also Read: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు అదిరిపోయాయ్!
ఇండియాకు వస్తున్న క్రమంలో..
దీంతో తనపై నమోదైన కేసుపై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో డైరెక్ట్గా దుబాయ్కి వెళ్లిపోయాడు. అనంతరం అక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోలను సన్నీ తన యూట్యూబ్లో పోస్టు చేశాడు. అనంతరం తిరిగి ఇండియాకు వస్తున్న క్రమంలో పోలీసులు అతడ్ని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్లోనే?
పాకిస్తాన్ సందర్శనకు గల కారణాలపై బయ్యా సన్నీ యాదవ్ను విచారించేందుకు NIA అధికారులు అతణ్ని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. అతడు ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలోనూ పాకిస్తాన్లోనే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సన్నీ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు..?, ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా అతడు పాక్కు వెళ్లడానికి గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు సన్నీని విచారిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పహల్గాం అటాక్ అనంతరం భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులను తమ దేశానికి వెళ్లిపోమ్మని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: హైదరాబాద్లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
అదే సమయంలో పాక్ ప్రభుత్వం సైతం తమ దేశంలో ఉన్న భారత పౌరులను ఇండియాకు వెళ్లాలని తెలిపింది. అలాంటి టైంలో బయ్యా సన్నీ యాదవ్ను తమ దేశంలోకి అనుమతించడం వెనుక ఏదో కారణం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా అతడు గతంలో కూడా దాదాపు 5 సార్లు పాకిస్తాన్కు బైక్ మీద వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలను సైతం అతడు బాగా ప్రమోట్ చేసుకున్నాడు.
బయ్యా సన్నీ యాదవ్ బ్యాక్ గ్రౌండ్
బయ్యా సన్నీ యాదవ్ సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో పుట్టి పెరిగాడు. అతడి తండ్రి ఒక ఫార్మసీ స్టోర్ నడిపిస్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. సోదరుడు కల్యాణ్ ఒక కబడ్డీ ప్లేయర్. వీరిది మధ్యతరగతి కుటుంబం. సన్నీ తన 13 ఏళ్లకే వెహికల్ నడపడం నేర్చుకున్నాడు. 18 ఏళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. 2016లో వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. అక్కడ నుంచి ప్రయత్నాలు చేశాడు.
మొదట 100 నుంచి 150 కి.మీ ప్రయాణించి వీడియోలు పెట్టేవాడు. ఆ తర్వాత 2018 నుంచి లాంగ్ డ్రైవ్ వేశాడు. 2019లో 21 రోజుల్లో లద్దాఖ్ యాత్రకు వెళ్లాడు. అది సన్నీ జీవితాన్నే మార్చేసింది. ఆ యాత్రతో సన్నీ సబ్స్ర్కైబర్లు భారీగా పెరిగిపోయారు. దాదాపు 3లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. అక్కడ నుంచి దేశ, విదేశాల్లో తిరిగి వ్లాగింగ్ చేస్తూ వచ్చాడు. చివరికి గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చూడాలి మరి సన్నీ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో.