/rtv/media/media_files/2025/06/20/shahid-beheshti-terminal-2025-06-20-11-05-40.jpg)
Iran-Israel War: దాదాపు వారం రోజులకుపైగా ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా రూ.4771 కోట్లు ప్రమాదంలో పడ్డాయి. 2024 మేలో ఇరాన్ చాబహార్లోని షాహిద్ బెహెష్టి టెర్మినల్ నిర్వహణకు భారతదేశం 10 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికోసం అన్నీ విధాలన భారత్ రూ.4771 కోట్లు ఖర్చు పెట్టింది. ఇరాన్కు చెందిన అరియా బనదర్తో భాగస్వామ్యంతో IPGL దాని కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అయితే, 2017 ప్రారంభంలో అదానీ గ్రూప్, ఎస్సార్ వంటి ప్రైవేట్ కంపెనీలు దీనిని నిర్వహించడానికి ఆసక్తి చూపించాయి.
Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్లు.. ఏవి మంచివి?
ఈ ఓడరేవు అభివృద్ధిలో భారతదేశం భారీ పెట్టుబడిని కలిగి ఉంది. షాహిద్ బెహెష్టి టెర్మినల్ ఇరాన్లో రెండవ అతిపెద్ద ఓడరేవు. చాబహార్-జహెడాన్ రైల్వే ప్రాజెక్ట్ కింద $1.6 బిలియన్ల అవగాహన ఒప్పందం కింద రైల్వే కనెక్టివిటీ పనిని భారత ప్రభుత్వ రంగ సంస్థ IRCON ఇంటర్నేషనల్కు అప్పగించారు, కానీ నిధుల జాప్యం కారణంగా 2020లో ఇరాన్ దాని నుండి పాక్షికంగా వైదొలిగింది. చాబహార్ నౌకాశ్రయాన్ని 2026 నాటికి ఇరాన్ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించాలని ప్రణాళిక చేయబడింది.
Also Read: డీఎంకే కుటుంబంలో కలహాలు..ఆస్తి కోసం సోదరుల తగువులు
చైనా, అమెరికా సవాలు
చైనా కూడా చాబహార్ పోర్టు అభివృద్ధిపై ఆసక్తి చూపుతోంది. దాని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద దానిని గ్వాదర్ పోర్టుకు అనుసంధానించాలని ఆలోచిస్తోంది. అదే సమయంలో చాబహార్ పోర్టు అభివృద్ధిలో భారతదేశం పాల్గొనడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్పై విధించిన ఆంక్షలను ఉటంకిస్తూ, ఇరాన్తో వ్యాపారం చేసే ఎవరైనా ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. కొనసాగుతున్న ఇజ్రాయెల్, -ఇరాన్ వివాదం విస్తరించిన అమెరికా ప్రమేయం చాబహార్లో కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చని, ఇది భీమా, లాజిస్టిక్స్ మరియు INSTC కారిడార్ను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పాశ్చాత్య ఆంక్షలు ఒక అడ్డంకిగా కొనసాగుతున్నాయి. ఇది ఓడరేవు అభివృద్ధి, రైలు కనెక్టివిటీ చొరవలను క్లిష్టతరం చేస్తుంది.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్