India China: 5 ఏళ్ల తర్వాత మళ్లీ కైలాస మానస సరోవర్ యాత్ర..

కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర తిరిగి మొదలవనుంది. ఈ క్రమంలోనే భారత్, చైనా దేశాలు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఈ క్రమంలో రెండు దేశాల మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులను కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి.

New Update
maasa  sarovar

maasa sarovar

చాలా సంవత్సరాలుగా భారత్ -చైనా మధ్య నెలకొన్న వివాదాలు గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పు లఢఖ్‌లోని గల్వాన్ లోయలో గతంలో తలెత్తిన వివాదం ముగిసిపోవడంతో ఇప్పటికే సరిహద్దుల్లో ఏర్పడిన ప్రతిష్ఠంభనకు విరామం దొరికింది. రెండు దేశాలకు చెందిన సైన్యాలు.. సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. 

Also Read: Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే

ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు దేశాల మధ్య కీలక నిర్ణయాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ వేసవికాలంలో కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించాలని.. భారత్‌, చైనా దేశాలు నిర్ణయించాయి. అదే సమయంలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత్ చైనా దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

Also Read: Mohammed Shami: మూడో టీ20లో ఆడనున్న మహ్మద్ షమీ.. కోచ్ కీలక ప్రకటన!

ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ చైనా పర్యటనలో ఉండగా.. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం గురించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ వెలుగుచూసిన నేపథ్యంలో 2020లో ఈ కైలాస పర్వతం, మానస సరోవర్‌ సరస్సు పర్యటనలను రెండు దేశాలు నిలిపివేశాయి. ఆ తర్వాత అదే ఏడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు  కోల్పోయాయి.. 

దీంతో కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణకు రెండు దేశాలు ముందుకు రాలేదు. దీంతో ఈ యాత్ర ఆగిపోయింది. అదే సమయంలో భారత్ చైనా దేశాల మధ్య నేరుగా నడిచే విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా.. గతేడాది ఇరు దేశాల అధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్‌లు రష్యాలోని కజాన్‌లో సమావేశం అయ్యారు. 

వేసవి కాలం నుంచి...

ఈ సమావేశం తర్వాతే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం ప్రారంభం అయ్యాయి. 2025 వేసవి కాలం నుంచి మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా.. ఈ యాత్రకు సంబంధించి అన్ని విషయాలను సంబంధిత అధికారులు చర్చలు జరుపుతారని వెల్లడించింది. 

సరిహద్దు నదులకు సంబంధించిన నీటి వనరుల డేటా, ఇతర సహకారాలపై రెండు దేశాలకు చెందిన నిపుణుల బృందం చర్చలు మొదలుపెట్టడానికి అంగీకారానికి వచ్చాయని విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు.. భారత్ - చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో ఇరు దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Also Read: Telangana: మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడొద్దు.. పోలీసులు కీలక విజ్ఞప్తి

Also Read: Delhi Burari: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని!

Advertisment
Advertisment
తాజా కథనాలు