భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఆపరేషన్ సిందూర్కి ప్రతీకారంగా పాక్ భారత్పై దాడికి పాల్పడగా.. ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. మే 9వ తేదీన వరుస డ్రోన్ల దాడులతో పాకిస్థాన్ ప్రజలలో ఆందళోన మొదలైంది. ఈ దాడుల్లో ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పాక్ పన్నిన కుట్రలను భారత్ భగ్నం చేస్తోంది. ఈ మే 9వ తేదీకి పాక్ భయపడుతోంది. 2023 మే 9లాగానే నేడు కూడా పాక్క బ్లాక్ డేగా మారుతుంది ఏమోనని పాక్ ప్రజలు భయపడుతున్నారు.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
9 MAY BLACK DAY OF PAKISTAN! #ReleaseKhanForPakistan@TeamiPians pic.twitter.com/Bt9NWrDGSX
— 𝗞𝗛𝗔𝗡 𝗞𝗜 𝗗𝗘𝗘𝗪𝗔𝗡𝗜🐦ⁱᴾⁱᵃⁿ (@AnGelAlish2) May 9, 2025
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
రెండేళ్ల కిందట ఇదే రోజు..
సరిగ్గా రెండేళ్ల కిందట మే 9వ తేదీన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాక్లో హింస చెలరేగింది. దీనివల్ల కోట్ల రూపాయలు నష్టాన్ని పాక్ చవిచూసింది. అలాగే సైనిక భవనాలతో పాటు 40 ప్రభుత్వ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రావల్పిండిలోని ఆర్మీ కార్ప్స్ కమాండర్ నివాసం, జనరల్ హెడ్ క్వార్టర్స్, పాకిస్తాన్ వైమానిక దళం అయిన ఆలం ఎయిర్ బేస్, ఫైసలాబాద్లోని ఐఎస్ఐ కార్యాలయం, చక్రలోని ఫ్రాంటియర్ కార్ప్స్ కోట లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
దీనివల్ల పాక్కు దాదాపుగా రెండు బిలియన్ల పాకిస్తానీ రూపాయల నష్టం వాటిల్లింది. అయితే భారత్ కూడా పాక్పై ఇదే తేదీన దాడులు చేయడంతో.. పాక్లో కొన్ని ప్రదేశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా రావల్పిండిపై భారత్ డ్రోన్లు విరుచుకుపడటంతో మరో బ్లాక్ డేగా మారుతుంది ఏమోనని షెహబాజ్ షరీఫ్ భయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!