భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిపోయింది. పాక్ మరోసారి భారత్కు వ్యతిరేకంగా తన దుర్మార్గపు కార్యకలాపాలను అమలు చేయడానికి ప్రయత్నించింది. పాక్తో రాత్రి జరిగిన ఈ యుద్ధంలో భారత్కు చెందిన INS విక్రాంత్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, S400, ZSU-23-4 షిల్కా, L70 యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ గన్ వంటి ఆయుధాలు బ్రహ్మస్త్రంలా పనిచేశాయి. ఇవే భారత హీరోలుగా నిలిచాయి. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను మోకరిల్లేలా చేశాయి.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
పాకిస్తాన్ చిత్తు చిత్తు
జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్, అఖ్నూర్, జైసల్మేర్, జలంధర్, ఫిరోజ్పూర్, పోఖ్రాన్తో సహా పలు భారత ప్రాంతాలపై పాక్ డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. ముందుగానే పసిగట్టిన ఇండియన్ ఆర్మీ పవర్ ఫుల్ ఆయుధాలతో.. పాకిస్తాన్ ప్రతి ప్రయత్నాన్ని భగ్నం చేసింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
ఇందులో భాగంగానే పాకిస్తాన్కు చెందిన రెండు JF-17, ఒక F-16 యుద్ధ విమానాలను కూల్చివేసింది. అలాగే పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన AWACS విమానాన్ని ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ S-400, L-70 వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి దాదాపు 50 కి పైగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసింది.
Also Read : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు
అందుతున్న సమాచారం ప్రకారం.. పాక్ దాదాపు 15 ప్రాంతాల్లో దాడులకు యత్నించినట్లు తెలిసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, అడంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లై, భుజ్లపై పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. కానీ ఆయా ప్రాంతాల్లో భారత్ ఆర్మీ వాటిని తిప్పికొట్టింది.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
operation Sindoor | latest-telugu-news | telugu-news