Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది ఎల్​నినో న్యూట్రల్​ కండిషన్స్​ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చి చెప్పింది.ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య ఎల్​నినో బలపడొచ్చని సంస్థ అభిప్రాయపడింది.

New Update
hyd

ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్​ తొలి వారంలో ఇచ్చే తొలి అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పగటి పూట ఎండ మంట.. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఎల్​నినో న్యూట్రల్​ కండిషన్స్​ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చి చెప్పింది.

Also Read: CBN: మా అమ్మ కన్నీళ్లు చూసి ..వెంటనే ఆ నిర్ణయం తీసుకున్నాను!

డిసెంబర్​లో లానినా పరిస్థితులున్నా.. ప్రస్తుతం అది బలహీనపడిందని పేర్కొంది.  ప్రస్తుతం పసిఫిక్​ మహాసముద్రంలో టెంపరేచర్లు కొంచెం పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే మార్చి నుంచి మే వరకు ఎల్​నినో న్యూట్రల్​ పరిస్థితులు 60 శాతం వరకు ఉండొచ్చని డబ్ల్యూఎంవో చెప్పింది. ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య ఎల్​నినో బలపడొచ్చని అభిప్రాయపడింది. అయితే, ఇప్పుడే దానిపై ఓ స్పష్టతకు రాలేమని పేర్కొంది. 

Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ప్రస్తుతానికైతే లానినా పరిస్థితులు 40 శాతం వరకున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో సాధారణ వర్షపాతమే రికార్డ్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట టెంపరేచర్లు 40 డిగ్రీల మార్క్​కు చేరువలో ఉన్నాయి. అదే సమయంలో రాత్రిపూట చలి ప్రభా వం కూడా కనిపిస్తున్నది. రాష్ట్రంలో శనివారం అత్యధికంగా మహబూబ్​నగర్​ జిల్లా కొత్తమోల్గరలో 39.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు. 

జగిత్యాల జిల్లా గోదూరు, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్​, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 39.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.మంచిర్యాల, నిర్మల్​, ఖమ్మం, రంగారెడ్డి, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇటు పలు జిల్లాల్లో రాత్రిపూట టెంపరేచర్లు తగ్గుముఖం పడుతున్నాయి.

సిద్దిపేటలో 12.4, ఆదిలాబాద్​లో 12.4, నాగర్​కర్నూల్​లో 12.5, ములుగులో 12.5,  ఆసిఫాబాద్​, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 11.8, నిజామాబాద్​లో 12, రాజన్నసిరిసిల్లలో 12.3, జయశంకర్​ జిల్లాలో 12.6 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: Karnataka: నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు

Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు