Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... ప్రధాని మోదీతో రమేష్ ఏమన్నాడంటే..

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్‌ ఒక్కడే. ప్రస్తుతం అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటన గురించి అడిగి  తెలుసుకున్నారు.  

New Update
Prime Minister Modi visits Ramesh

Prime Minister Modi visits Ramesh

Air India Crash:  అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు  265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు.  ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్‌ ఒక్కడే. ప్రస్తుతం అహ్మదాబాద్‌  సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన గురించి అడిగి వివరాలు  తెలుసుకున్నారు.  


ఈ సందర్భంగా ఆయన మోదీతో మాట్లాడుతూ "ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెప్పాడు. విమానంలో 11ఏ సీట్‌లో కూర్చున్న రమేష్‌.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ ప్రచారం సాగింది. నిన్న అంతా సోషల్‌ మీడియాలో ఇదే వైరల్‌గా మారింది. అయితే రమేష్‌ మాత్రం తను ప్రాణాలతో బయటపడడానికి కారణం వివరించారు.

"అంతా క్షణాల్లో జరిగిపోయింది. తమ విమానం నేలకూలుతుందన్న విషయం నాకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు రమేష్‌. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డాను. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో నేను కూర్చున్న  సీటు ఎగిరి కాస్త దూరంలో  పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్‌ ప్రధాని మోదీతో చెప్పారు.

‘‘ప్రమాదం జరుగుతుందని అర్థం అయింది. ఇక  నేను బతకడం కష్టమే అనుకున్నా.  నా సీటు ఎగిరి కింద పడిన సమయంలో  సీటు దగ్గర్లో  విమాన ప్రధాన భాగం ఉందని అనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్‌ను నెమ్మదిగా తొలగించి.. పాక్కుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో చాలామంది అప్పటికే చనిపోయారు. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక..బయట జనం అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్‌ ఎక్కాను’’ అని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ రమేష్  ప్రధానితో తెలిపారు.
    
ఈ సందర్భంగా అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. అందరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలిని దర్శించి ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి వేసిందని, అధికారులు అవిశ్రాంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, ఏమాత్రం ఊహించని ఈ ఘటనతో తమ ప్రియతములను కోల్పోయిన వారి చుట్టూనే తన ఆలోచనను తిరుగుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు