Bribery Ordeal: కూతురు మరణ వేదనలోనూ లంచాలతో వేధించారు.. మాజీ CFO సంచలన పోస్ట్!

బెంగళూరు నగరంలో ఈ ఘటన జరిగింది. తన కుమార్తె మృతదేహానికి లాంఛనాలు పూర్తి చేయడానికి అంబులెన్స్ డ్రైవర్ల నుండి పోలీసుల వరకు, శ్మశానవాటిక సిబ్బంది నుండి ప్రభుత్వ అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ లంచం ఇవ్వక తప్పలేదన్నారు.

New Update
karnataka

కన్న కూతురిని(daughter) పోగొట్టుకుని తీవ్ర విషాదంలో ఉన్న ఓ తండ్రికి లంచం వేధింపులు(bribery ordeal) గురిచేశాయి. బెంగళూరు(bengaluru) నగరంలో ఈ ఘటన జరిగింది. తన కుమార్తె మృతదేహానికి లాంఛనాలు పూర్తి చేయడానికి అంబులెన్స్ డ్రైవర్ల నుండి పోలీసుల వరకు, శ్మశానవాటిక సిబ్బంది నుండి ప్రభుత్వ అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ లంచం ఇవ్వక తప్పలేదని ఆవేదన చెందుతూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. శివకుమార్ అనే ఓ వ్యక్తి ప్రభుత్వ రంగ సంస్థ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO). ఆయన కుమార్తె అక్షయ శివకుమార్ (34) సెప్టెంబర్ 18న మెదడు రక్తస్రావం కారణంగా మరణించింది. ఆమె గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఎనిమిది సంవత్సరాలు సహా కార్పొరేట్ రంగంలో 11 సంవత్సరాలు పనిచేశారు.

Also Read :  తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం.. నవంబర్ 24న బాధ్యతలు

మరి పేదల పరిస్థితి ఏంటి?

కుమార్తె మరణించిన బాధలో ఉన్నప్పటికీ, మృతదేహాన్ని తరలించడం, పోస్ట్‌మార్టం, ఎఫ్‌ఐఆర్ కాపీ, దహన సంస్కారాల రసీదు, చివరికి డెత్ సర్టిఫికేట్ పొందడం కోసం ప్రతి అడుగులోనూ లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు."నా దగ్గర డబ్బు ఉంది, అందుకే చెల్లించాను. మరి పేదల పరిస్థితి ఏంటి?" అని ఆయన తన పోస్టులో తెలిపారు. శివకుమార్ తన పోస్ట్‌లో మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు డిమాండ్ చేశాడని తెలిపారు. ఎఫ్‌ఐఆర్,  పోస్ట్‌మార్టం రిపోర్ట్ కాపీల కోసం బెళ్లందూరు పోలీస్ స్టేషన్‌లో బహిరంగంగానే లంచం డిమాండ్ చేశారని, సున్నితత్వం లేకుండా చాలా రుడ్‌గా ప్రవర్తించారని ఆరోపించారు. 

ఒక ఇన్‌స్పెక్టర్ వైఖరి మారాలంటే తన మాజీ యజమాని జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దహన సంస్కారాలు నిర్వహించడానికి శ్మశానవాటిక సిబ్బంది కూడా డబ్బు డిమాండ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  డెత్ సర్టిఫికేట్  కోసం బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కార్యాలయం చుట్టూ ఐదు రోజుల పాటు తిరగాల్సి వచ్చింది. చివరకు, అధికారిక రుసుము కంటే ఎక్కువ డబ్బు చెల్లించిన తర్వాతే ఒక ఉన్నతాధికారి ద్వారా సర్టిఫికెట్ లభించిందని తెలిపారు. 

Also Read :  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్లు ... ఆస్తులెంతో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో

ఈ అనుభవంతో విసిగిపోయిన శివకుమార్..  నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను. కానీ పేదవారు ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయాలి? కష్టంలో ఉన్నవారిని వేధించడానికి ఈ అధికారులకు కుటుంబాలు లేదా మనస్సులు లేవా అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై స్పందించిన బెంగళూరు వైట్‌ఫీల్డ్ డీసీపీ, ఈ ఘటనకు సంబంధించి బెళ్లందూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పీఎస్‌ఐ (PSI), ఒక కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. శివకుమార్ తన ఆవేదనను తెలియజేసిన ఈ పోస్ట్‌ను తర్వాత తొలగించినప్పటికీ, దాని స్క్రీన్‌షాట్‌లు విస్తృతంగా షేర్ అవుతూ, బెంగళూరులో నెలకొన్న అవినీతిపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు