PM Kisan Samman Scheme : రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు విడుదల

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను వారణాసిలో జరిగే కార్యక్రమంలో మోడీ విడుదల చేస్తారని పేర్కొంది.

New Update
PM Kisan amount status check (1)

PM Kisan Samman Scheme

PM Kisan Samman Scheme : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రం ఈ మేరకు ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని 9.7 కోట్ల మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి ఆగస్టు 2న రూ.2 వేలను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.కాగా 20వ విడతలో రూ.20,500 కోట్లు నిధులు రైతులకు పంపిణీ చేయనున్నారు.

Also Read : పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్‌లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఫిబ్రవరి 2, 2019లో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. అయితే అన్ని ఒకసారి కాకుండా ఈ నిధులు నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది. 

Also Read : తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు

పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యంగా కేంద్రం పేర్కొంటున్నది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్‌ దీదీలు, బ్యాంక్‌ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ పథకం ప్రయోజనం సకాలంలో e-KYC, భూమి రికార్డు ధృవీకరణ పూర్తి చేసిన రైతులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ చేయని లేదా రికార్డులు అసంపూర్ణంగా ఉన్నవారికి ఈసారి కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం వర్తించదని స్పష్టం చేసింది. ఈ విషయంలో అర్హత కలిగిన రైతులు వీలైనంత త్వరగా వారి వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు విజ్ఞప్తి చేసింది.

Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

Advertisment
తాజా కథనాలు