/rtv/media/media_files/2025/05/09/wVGvbW5Me8zILGpbS1rc.jpg)
Get ready for blood donations
Ind-Pak War : దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్ రెచ్చిపోతుంది. భారత బలగాలు తగిన రీతిలో జవాబిస్తు్న్నాయి. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్పై దాడులకు దిగింది. దీంతో పాక్లో పలు ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఇక పాకిస్థాన్ భారత సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది.
#FAIMA calls for nationwide emergency medical preparedness.
— FAIMA Doctors Association (@FAIMA_INDIA_) May 8, 2025
We request all doctors and associations to organize blood donation camps immediately and support our forces in any capacity whatsoever.
The medical fraternity stands united with our brave soldiers.
जय हिन्द! 🇮🇳 pic.twitter.com/FZvx2TxA2t
Also Read: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!
భారతదేశం, పాకిస్థాన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రెండు రోజులుగా దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా వైద్యులు, వైద్య సంస్థలు, ఇతర సామాజిక సంస్థలు వెంటనే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించింది.ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలను వెంటనే నిర్వహించాలని FAIMA కోరింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో మన రక్షణ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయని, ఈ క్రమంలో జవాన్లకు గాయలైతే వారిని కాపాడుకోవడానికి రక్తం అవసరం పడవచ్చని తెలిపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరింది.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
ఈ కీలకమైన ప్రయత్నం మన ధైర్య సాయుధ దళాలకు, గాయపడిన మన దేశ పౌరులకు అత్యవసర సమయంలో వైద్యం చేయడానికి ఉపయోగపడుతుందని FAIMA తెలిపింది. దానికోసం రక్తదాతలు ముందుకు రావాలని కోరింది. వైద్య సోదరులు మన సైనికులకు అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలని FAIMA కోరింది. సైన్యం, వైమానిక దళం, నావికాదళ సిబ్బందికి వైద్య సోదరులు తోడుగా ఉన్నారనే భావనను కలిగిస్తుందని FAIMA తెలిపింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేసింది. వైద్యులు, వైద్య సంఘాలు, ఇతర సామాజిక సంస్థలు వెంటనే రక్తదాన శిబిరాలను నిర్వహించాలని సూచించింది. అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా విస్తృతంగా రక్తదానాన్ని ప్రోత్సహించాలని కోరింది. ఈ రోజు మీ సహకారం రేపు ఒక దేశస్థుడి ప్రాణాన్ని కాపాడుతుందని FAIMA విజ్ఞప్తి చేస్తోంది.
Also Read: పాకిస్తాన్కి చుక్కలు చూపించిన సుదర్శన్ చక్రం.. భారత్కు శ్రీరామ రక్షలా రష్యా S-400