పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?

పాక్ క్షిపణులు, డ్రోన్లతో గురువారం భారత్‌పై దాడికి యత్నించింది. వాటిని ఇండియా ఎయిర్ డిఫెన్స్ S-400తో అడ్డుకుంది. గాల్లోనే వాటిని ధ్వంసం చేసింది. ఇండియాలో ఉన్న మూడు S-400లను సుదర్శన్ చక్రం అని పేరు. 400KM పరిధిలో ఏ మిస్సైల్ ఎగిరినా ఇది పేల్చేస్తోంది.

New Update
S 400 sudharshan

భారత్ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలపై గురువారం రాత్రి తెల్లవారుజామున 15 ప్రాంతాలపై పాక్ క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. వాటన్నింటినీ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ దాడి చేస్తోందని తెలిసి ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం సరిహద్దు ప్రాంతంలో శ్రతు క్షిపణులను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేసే S 400ను యాక్టీవ్ చేసింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలో ఇది కీలకం. దీనికి మనం పెట్టుకున్న పేరు సుదర్శన్ చక్రం. వీటిని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇండియా పాక్ హై టెన్షన్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ఇవి గేమ్ ఛేంజర్‌ లాంటివి.

ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌లను దృష్టిలో ఉంచుకునే S-400 క్షిపణి వ్యవస్థను బార్డర్‌లో మోహరించారు. దీని పరిధి 40 నుండి 400 కి.మీ. మధ్య ఉంటుంది. ఈ పరిధిలో శ్రువుల క్షిపణి, డ్రోన్లు వస్తే వాటిని గాల్లోనే పేల్చివేస్తోంది. 2018 అక్టోబర్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈ S-400 టెక్నాలజీ కోసం ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ క్షిపణి సాంకేతికత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పరిగణించబడుతుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లో వీటికి ఆదేశాలు అందుతాయి. ప్రతి S-400 స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి ఆరు లాంచర్లు, అడ్వాస్ రాడార్, ఓ కంట్రోల్ సెంట్రర్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఇవి ఒక్కో బ్యాటరీకి 128 క్షిపణులను సపోర్ట్ చేస్తాయి. భారతదేశం రష్యా నుంచి 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. వాటిలో మూడు S400 ఇప్పటికే పనిచేస్తున్నాయి.

2026 నాటికి మరో రెండు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఐదు S-400 స్క్వాడ్రన్ల కోనుగోలు కోసం రూ.35,000 కోట్ల ఒప్పందంపై  2018లో సంతకం ఇరు దేశాలు సంతకం చేశాయి. S-400 సుదర్శన్ 400 కి.మీ దూరంలో ఉన్న స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ లేదా బాలిస్టిక్ క్షిపణులతో సహా గాల్లో నుంచి దాడి చేసి ఎలాంటి ప్రమాదాన్ని అయినా గుర్తించగలదు. తర్వాత వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాల్లో సుదర్శన్ S-400 శత్రు క్షిపణులను80 శాతం పేల్చివేసి తన పరాక్రమాన్ని ప్రదర్శించింది. 

( S400 air defense missile | india pak war | latest-telugu-news | indian army operation sindoor | india operation sindoor | operation sindhoor | Indian army-air force operation sindoor | pakistan attack | india on pakistan attack)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు