Encounter: పీవోకేలో భద్రతా దళాలకు, టీటీపీ కు మధ్య ఎదురు కాల్పులు..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భద్రతా దళాలు, తెహ్రిక్-ఇ తాలిబన్  మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఉగ్రవాదులు..పోలీసుల మీదకు హ్యాండ్ గ్రనేడ్లు విసరడంతో పాటూ తమను తాము కాల్చుకున్నారు. ఇందులో ఇద్దరు పోలీసులతో పాటూ తిరుగుబాటు నాయకుడు జర్నోష్‌ నసీమ్ కూడా మృతి చెందాడు. 

New Update
POK

Encounter in POK

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావాల్ కోట్ జిల్లాలోని హుస్సేన్ కోట్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులతో పాటూ ఇద్దరు పోలీసులు మృతి చెందారు. భద్రతా దళాల కథనం ప్రకారం..భద్రతా దళాలు అనుమానిత రహస్య స్థావరంపై దాడి చేసినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బృందంపై కాల్పులు జరిపి, హ్యాండ్ గ్రెనేడ్లు విసిరారని..ఫలితంగా ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు తమను తాము కూడా కాల్పుకున్నారు. దీంతో నలుగురు టీటీపీ ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో తిరుగుబాటు నాయకుడు జరోమ్ నసీమ్ కూడా ఉన్నాడు. 

ఐఎస్ఐ కిడ్నాప్..

జరోష్ నసీమ్ కొంత కాలంగా రావల్ కోట్ లోనే నివసిస్తున్నాడని..ఇతనిని 2024లో ఐఎస్ఐ కిడ్నాప్
 చేసిందని చెప్పారు. జర్నోష్‌ నసీమ్‌ విడుదల కోసం అప్పట్లో కాశ్మీరీలు పోరాటం కూడా చేశారని తెలిపారు. 

 

today-latest-news-in-telugu | encounter 

Also Read: BIG BREAKING:  ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు లొంగుబాటు

Advertisment
Advertisment
తాజా కథనాలు