పాకిస్థాన్ దాడులు.. కేంద్రం సంచలన ప్రకటన

గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్‌లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు.ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్‌కు సాయం చేయొద్దని కోరుతామన్నారు.

New Update

గురువారం రాత్రి పాకిస్థాన్‌.. భారత్‌పై దాడులకు దిగగా వాటిని మన భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ జరిపిన దాడుల గురించి వివరించారు.     '' ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్థాన్ యత్నిస్తోంది. సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు కుటిలయత్నాలు చేస్తోంది. పాక్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని చెప్పడం అబద్ధం.

Also Read: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!

 నిన్న రాత్రి మన సైనిక స్థావారాలపై పాక్ దాడులకు యత్నించింది. 3--00--400 డ్రోన్లతో దాడికి యత్నించింది.  పాక్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాం. కర్తార్‌పూర్ కారిడర్ మూసివేశాం. పూంఛ్‌లో స్కూల్‌పై పాక్ దాడి చేసింది. పాఠశాల సిబ్బంది, నన్స్‌ దాక్కున్నారు. దాడి సమయంలో స్కూల్‌ మూసేసి ఉంది. అలాగే LOC వెంబడి నిరంతరం కాల్పులు జరుపుతోంది. లేహ్ నుంచి సర్‌క్రీక్‌ వరకు 36 చోట్ల దాడులకు పాల్పడింది. ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్‌కు సాయం చేయొద్దని కోరుతామని'' అన్నారు. 
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు