/rtv/media/media_files/2025/06/08/WrR6Ws4EePESE23vElcb.jpg)
Ind-Eng Test series
ఐపీఎల్ సందడి అయిపోయింది. ఇప్పుడు ఇక భారత జట్టు టెస్ట్ కు రెడీ అయింది. రోహిత్, విరాట్ లేకుండా యువ జట్టు అంతా ఇంగ్లాండ్ వెళుతోంది. శుభ మన్ గిల్ ఈ జట్టుకు సార్థ్యం వహిస్తున్నాడు. ఈ నెల 20 నుంచి టెస్ట్ సీరీస్ మొదలవనుంది. మొదటి టెస్ట్ జూన్ 20 నుంచి 24 వరకు అవుతుంది. లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో ఇది జరగనుంది. రెండో టెస్ట్ జులై2 నుంచి 6 వరకు బర్మింగహామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. మూడో టెస్ట్ జూలై 10 నుంచి 14 వరకు లండన్ లోని లార్డ్స్ లో జరుగుతుంది. ఇక నాలుగో టెస్ట్ జులై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్ లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ లో..ఐదో టెస్ట్ జులై 31నుంచి ఆగస్టు 4 వరకు లండన్ లోని కోన్నింగ్టన్ ఓవల్ లో అవనున్నాయి.
రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్ కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్కు టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పేరు పెట్టారు. గంభీర్ నేతృత్వంలోని జట్టు ఈరోజు లండన్ చేరుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 కూడా ఇంగ్లండ్ - ఇండియా సిరీస్తోనే ప్రారంభం కానుంది. భారత జట్టకు శుభ్ మన్ గిల్ సారధ్యం వహించనున్నాడు. ఈ ఐదు టెస్ట్ సీరీస్ కన్నా ముందు భారత్ ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్ తో రెండు అనధికార మ్యాచ్ లు ఆడుతుంది.
TEAM INDIA HAVE ARRIVED IN ENGLAND FOR THE TENDULKAR-ANDERSON TROPHY. 🇮🇳pic.twitter.com/mRjNWVVa90
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 7, 2025
టీమిండియా స్క్వాడ్
అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్ స్క్వాడ్
బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జెమీ స్మిత్, శామ్యూల్ జేమ్స్ కుక్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్, జాష్ టంగ్, జెమీ ఓవర్టన్.