Election Commission: ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు EC చెక్

దేశంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఎన్నికల్లోనూ పోటీ చేయని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో పాల్గొనని 345 పార్టీలను డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

author-image
By K Mohan
New Update
central-election-commission

దేశంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఉన్న పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని 345 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీస్‌ - ఆర్‌యూపీపీ) గుర్తించింది. వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.

Also Read : పెళ్లి మండపంలో మందు, సిగరేట్ తాగిన వధువు: వీడియో వైరల్

Election Commission Bans 345 Political Parties

Also Read :  ఏపీలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం!

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ పార్టీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో వాటి కార్యాలయాలు కూడా ఉనికిలో లేవని ఎన్నికల సంఘం తన పరిశీలనలో తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం వద్ద సుమారు 2,800కు పైగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. సాధారణంగా, ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు పొందాలంటే, జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. లేదా నిర్దిష్ట సంఖ్యలో అసెంబ్లీ లేదా లోక్‌సభ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలను అందుకోలేని పార్టీలను కేవలం నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు. 

Also Read :  ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు ఫైర్

Also Read :  స్కూల్లో తొక్కిసలాట.. 29మంది పిల్లలు మృతి, 250 మందికి పైగా!

 

latest-telugu-news | election-commission | central-election-commission | chief election commissioner | political-parties

Advertisment
Advertisment
తాజా కథనాలు