MP: ఆఫ్రికా నుంచి మరో 8 చీతాలు భారత్ కు..

దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మరో 8 చీతాలు భారతదేశానికి రానున్నాయి. రెండు విడతల్లో ఇవి ఇక్కడకు వస్తాయి. మేలో 4...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ తెలిపింది. 

New Update
Rajamahendravaram leopard: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం

దేశంలోకి మళ్ళీ చిరుతలు వస్తున్నాయి. ఈసారి ఎనిమిది చీతాలను తీసుకురానున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. మేలో నాలుగు...ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. 

ప్రాజెక్టు చీతా..

ఆఫ్రికా నుంచి చిరుతలను తీసుకురావడం ఇది రెండోసారి. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. ఇంతకు ముందు తీసుకువచ్చిన చిరుత పునరావాసానికి వెళ్ళిందని తెలిపారు. ప్రాజెక్టు చీతా కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దశలవారీగా తరలించనున్నట్లు ఎన్‌టీసీఏ అధికారులు చెప్పారు. రాజస్థాన్ మధ్య అంతర్-రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటుచేయడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. 

 today-latest-news-in-telugu | Madhya Pradesh | cheetah | africa

Also Read: 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాల నిలుపుదల

Advertisment
Advertisment
తాజా కథనాలు