JEE Results: 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాల నిలుపుదల

జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. వారు ఫోర్జరీ దస్త్రాలు ఉపయోగించారని గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు. 

author-image
By Manogna alamuru
New Update
 results

ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా చూసిరాతలు, ఫోర్జరీలు లాంటి తప్పించలేకపోతున్నారు. గత ఏడాది నీట్ ఎగ్జామ్ లో ఎన్ని అవకతవకలు జరిగాయో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీయే చాలా జాగ్రత్తగా ఉంటోంది. చాలా కఠినమైన రూల్స్ పెడుతూ పరీక్షలు నిర్వహిస్తోంది. రీసెంట్ గా ఎన్టీయే జేఈఈ పరీక్షలను నిర్వహించింది. నిన్న మధ్యాహ్నం వాటి ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ (మెయిన్‌) సెషన్-2 ఫలితాల్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  పర్సంటైల్‌ స్కోరును రిలీజ్ చేసింది. అయితే తాజాగా ఇప్పుడు అందులో 110 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపి వేసింది. అభ్యర్థులు ఫోర్జరీ దస్త్రాలను ఉపయోగించారని...అందుకే వారి ఫలితాలను ఆపేశామని ఎన్టీయే చెప్పింది. 

నిన్న ఫలితాలు విడుదల..

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నాం ఫైనల్‌ కీవిడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు..తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు.

Also Read:ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?

దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 2,3,4,7,8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు జరిగాయి. స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌ పాస్వర్డ్‌ తో పాటు క్యాప్చా కోడ్‌ కూడా ఎంటర్‌ చేసి కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 today-latest-news-in-telugu | jee | mains | results | fraud 

Also Read: USA: ట్రంప్ మాట్లాడుతుండగా స్పృహ తప్పిపడిపోయిన బాలిక..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు