Robert Vadra: రాబర్ట్‌ వాద్రాకి బిగ్ షాక్.. ఆ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు ED

కాంగ్రెస్‌ MP ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాపై షికోపుర్‌ ల్యాండ్స్‌ కేసులో ED తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని పలుమార్లు దర్యాప్తు సంస్థ విచారణకు పిలిపించి ప్రశ్నించింది.

New Update
Priyanka gandhi and Robert Vadra

Priyanka gandhi and Robert Vadra

కాంగ్రెస్‌ MP ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాపై షికోపుర్‌ ల్యాండ్స్‌ కేసులో ED తాజాగా ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని పలుమార్లు దర్యాప్తు సంస్థ విచారణకు పిలిపించి ప్రశ్నించింది. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.

Also Read:Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

Robert Vadra

ఈ కేసుకు సంబంధించి 2018 సెప్టెంబర్‌లో వాద్రా పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఆయనతోపాటు నాటి హరియాణా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌, ఓ ప్రాపర్టీ డీలర్‌ పేరును దీనిలో ప్రస్తావించారు. దీనిలో అవినీతి, ఫోర్జరీ చీటింగ్‌ తదితర నేరాలు నమోదయ్యాయి. 

Also Read : సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!

ఇది కూడా చదవండి:కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి

latest-telugu-news | robert-vadra

Advertisment
తాజా కథనాలు